Etala Rajender: మేడ్చల్ రైల్వేస్టేషన్ ను రూ. 32 కోట్లతో అభివృద్ధి..
- మేడ్చల్ రైల్వేస్టేషన్ 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి..
- మేడ్చల్ రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etala Rajender: Etala Rajender: మేడ్చల్ రైల్వేస్టేషన్ 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్, RUB పనులను పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ కంటే ముందు.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదన్నారు. మోడీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో రెండువేల కోట్లతో.. రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలు తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్లో 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారని అన్నారు.
Read also: G. Kishan Reddy: నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
మెట్రోరైల్ మాదిరిగా MMTS కి కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయమని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత సికింద్రాబాద్లో ఉన్న ఉన్నతాధికారులను పంపించారని తెలిపారు. వారితో కలిసి ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను, RUB లను పరిశీలన చేస్తున్నామన్నారు. ఈ ప్రపోజల్స్ అన్నీ ఢిల్లీ తీసుకుపోయి అతి తొందరలో వీటన్నింటిని పరిష్కారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం తీసుకొని అతి త్వరలో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. బొల్లారం, వినాయకనగర్ గేట్లు రెండు రెండు గంటలు పడుతున్నాయని.. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమ్మగూడెం అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జాం అవుతుందన్నారు. మరో 20 సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ లను అభివృద్ధి చేస్తామన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని రైలు నిలయం, రైల్వే ఆస్తులు, చర్లపల్లి టెర్మినల్, అనేక రైల్వే లైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
TG DSC Hall Tickets: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల..
తాజావార్తలు
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
-
spirit : స్పిరిట్ పోస్ట్పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్