Medaram Jatara 2022: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. తగ్గిన ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వైభవంగా ముగిసిన విషయం తెలిసిందే.. ఇక, జాతర ముగియడం, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోవడంతో.. హుండీ లెక్కింపు చేపట్టారు.. ఇవాళ సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు పూర్తి చేశారు.. ఈసారి హుండీ ఆదాయం రూ.11 కోట్లను దాటేసింది.. రూ.11 కోట్ల 44 లక్షలు 12 వేల 707 రూపాయలు హుండీ ద్వారా లభించినట్టు ప్రకటించారు.. ఇక, బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోల 350 గ్రాములు భక్తులు సమర్పించినట్టు వెల్లడించారు.. ఈసారి చిల్లర నాణేలు ద్వారా రూ. 37 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.
Read Also: Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
అయితే, 2020 జాతర కంటే ఈసారి మాత్రం మేడారం హుండీ ఆదాయం తగ్గిపోయింది.. గత జాతరలో రూ.11.64 కోట్ల ఆదాయం రాగా.. బంగారం ఒక కేజీ 63 గ్రాముల 900 మిల్లిలు, వెండి 53 కేజీల 450 గ్రాములుగా వచ్చింది.. ఈసారి హుండీ ద్వారా 816 మంది రూ.3.04 లక్షలు మూడు లక్షల నాలుగు వేలు అమ్మవార్లకు సమర్పించిన భక్తులు.. కానీ, మొత్తంగా గత జాతరతో పోలిస్తే ఈసారి మేడారం జాతర హుండీ ఆదాయం దాదాపు రూ.20 లక్షలు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..