Edupayala Temple: 12 రోజులుగా జలదిగ్బంధంలోనే వనదుర్గ ఆలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Edupayala Temple: మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం వద్ద సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు. ఏడు పాయల ఆలయం ముందు ఇంకా వరద కొనసాగుతూనే వుంది. 12 రోజులుగా వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం దగ్గర మంజీరా నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టుకి భారీగా వరద వస్తుండటంతో 4 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు. మంజీరా నదిలో సింగూరు జలాలు కలవడంతో అమ్మవారి ఆలయం ముందు మంజీరానది పరవళ్లు తొక్కుతోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఇన్ ఫ్లో- 34918 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- 40600 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం- 28.666 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటి మట్టం- 29.917 టీఎంసీలు, జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
గతంలో వర్షాకాలంలో అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే వుండడం సర్వసాధారణం. కానీ ఈ ఏడాది అక్టోబర్ నెలలోనూ అమ్మవారిని వరద వీడడం లేదు. దీంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. రోజూ వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండడంతో భక్తుల రావద్దని అధికారులు సూచించారు. పచ్చని అడవి, డెన్ లోపల సహజ రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. వర్షాకాలంలో వరద ఆలయంలోపలికి ప్రవశిస్తుంది. దుర్గభావానీ పాదానికి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తుంటారు. కానీ ఈసారి ఆలయం ఎక్కువగా వరద నీటిలోనే ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వరద నీటి సవ్వడి తప్ప భక్తుల సందడి కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?