Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో హైఅలర్ట్.. ఈ నెల 20 వరకు ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఆగస్టు 15 సందర్భంగా ఈనెల 20వరకు శంషాబాద్ లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు, సందర్శకులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆగస్ట్ 20 వరకు విమానాశ్రయంలోకి సందర్శకులను అనుమతించబోమని ప్రకటించారు.ఆగస్టు 16 వరకు అన్ని రకాల పాస్ లను రద్దు చేస్తున్నామని తెలిపారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపై సీఐఎస్ ఎఫ్, రక్ష, పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో ఎయిర్పోర్టులో పార్కింగ్, బయలు దేరి, రాకపోకలను తనిఖీ చేస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరు మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
Read also: Astrology: ఆగస్టు 10, గురువారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
రోజుకు సుమారు 5 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఈ నెలలోనే వెళ్తున్నారని వెల్లడించారు. వారిని పంపించేందుకు చాలా మంది వస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక్కో విద్యార్థిని పంపించేందుకు 30 నుంచి 50 మంది వస్తున్నారని తెలిపారు. పది రోజులుగా రోజుకు లక్ష మంది విమానాశ్రయానికి వస్తున్నారని నారాయణరెడ్డి తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే వారంతా వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారని, దీంతో ట్రాఫిక్, పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. విమానాశ్రయానికి రోజుకు 70 వేలకు పైగా కార్లు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఎయిర్పోర్టులో అప్రమత్తంగా ఉండనున్నట్లు ప్రకటించారు. విమానాశ్రయంలో ఆంక్షలు ఉంటాయని, సెండ్ ఆఫ్ కోసం వచ్చే తల్లిదండ్రులు రావద్దని సూచించారు.
Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!