Praja Bhavan: ప్రజావాణికి భారీగా జనం.. భూ సమస్య, పెన్షన్ల పై ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ.. శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు. ప్రజా వాణికి మంత్రులు వచ్చారు. ఫిర్యాదులు స్వీకరణ.. సమస్య తీవ్రతబట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఫిర్యాదుల్లో భూ సమస్య..పెన్షన్ల ల కోసం వస్తున్న ప్రజలే ఎక్కువగా మంది రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ తొమ్మిది గంటలకు కిలోమీటరుకు పైగా పెరిగింది. వారిని క్రమపద్ధతిలో నిలువరించి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది.
Read also: Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ ప్రజాభవన్కు రావాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలు సత్వరమే పరిష్కారం కావడమే కాకుండా హైదరాబాద్ వచ్చే ప్రజల భారం తగ్గుతుందన్నారు. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం తదితర సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా దర్భార్ అనే ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా మార్చారు. అప్పటి నుంచి ప్రతి మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈమేరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.
Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
తాజావార్తలు
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!