Praja Bhavan: ప్రజావాణికి భారీగా జనం.. భూ సమస్య, పెన్షన్ల పై ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ.. శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు. ప్రజా వాణికి మంత్రులు వచ్చారు. ఫిర్యాదులు స్వీకరణ.. సమస్య తీవ్రతబట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఫిర్యాదుల్లో భూ సమస్య..పెన్షన్ల ల కోసం వస్తున్న ప్రజలే ఎక్కువగా మంది రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ తొమ్మిది గంటలకు కిలోమీటరుకు పైగా పెరిగింది. వారిని క్రమపద్ధతిలో నిలువరించి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది.
Read also: Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
Also Read
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ ప్రజాభవన్కు రావాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో ప్రజావాణి నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలు సత్వరమే పరిష్కారం కావడమే కాకుండా హైదరాబాద్ వచ్చే ప్రజల భారం తగ్గుతుందన్నారు. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం తదితర సమస్యలపైనే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా దర్భార్ అనే ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా మార్చారు. అప్పటి నుంచి ప్రతి మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈమేరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.
Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!