రాబోయే రోజుల్లో జనజాగరణ పాదయాత్రలు: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు.
Read Also:పీఆర్సీ పై ముగిసిన జగన్ సమీక్ష
Also Read
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
రాబోయే రోజులలో ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలు, జన జాగరణ పాదయాత్రలను విస్తృతంగా జరపాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఏఐసీసీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలలో నాయకులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.జనవరి 10వ తేదీ నుంచి నిర్వహించే ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. నాయకులందరూ పార్టీలైన్లో క్రమశిక్షణతో పనిచేయాలని మానిక్కమ్ ఠాగూర్ పేర్కొన్నారు.
సమావేశంలో జగ్గారెడ్డితో సహా నేతల కీలక వ్యాఖ్యలు
నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని నా వల్ల ఇబ్బంది అయితే తప్పుకుంటా అని చెప్పారు జగ్గారెడ్డి . అయితే, తప్పుకోవడం ఎందుకు…పొరపాట్లు సరిదిద్దుకుని పని చేసుకుని పోవాలి అని సర్దిచెప్జాపారు జానారెడ్డి, శ్రీధర్ బాబు. ఎవరికి వారు మాట్లాడుకుంటూ పోతే.. పార్టీకి నష్టం కాదా..? అని జానారెడ్డి అన్నారు. ప్రతీది అందరికి చెప్పాలని అనడం సరికాదని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అందరూ వస్తున్నారు… నాకు సమాచారం ఇస్తున్నారా..? అని పరోక్షంగా జగ్గారెడ్డిని ఉద్దేశించి అడిగారు అంజన్ కుమార్.. పదవితో కాదు… నేను కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని తెలిపారు జగ్గారెడ్డి. మనం మనం కొట్టుకోవడం కోసం కాదు మీటింగులు అని సర్దిచెప్పారు మధు యాష్కీ. పార్టీ యాక్షన్ ప్లాన్ పై చర్చ చేయండి. అంతర్గత సమస్యలు… అంతర్గతంగా చర్చ చేసుకోవాలని మధు యాష్కీ సూచించారు.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!