రాబోయే రోజుల్లో జనజాగరణ పాదయాత్రలు: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు.
Read Also:పీఆర్సీ పై ముగిసిన జగన్ సమీక్ష
Also Read
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
రాబోయే రోజులలో ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలు, జన జాగరణ పాదయాత్రలను విస్తృతంగా జరపాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఏఐసీసీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలలో నాయకులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.జనవరి 10వ తేదీ నుంచి నిర్వహించే ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. నాయకులందరూ పార్టీలైన్లో క్రమశిక్షణతో పనిచేయాలని మానిక్కమ్ ఠాగూర్ పేర్కొన్నారు.
సమావేశంలో జగ్గారెడ్డితో సహా నేతల కీలక వ్యాఖ్యలు
నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని నా వల్ల ఇబ్బంది అయితే తప్పుకుంటా అని చెప్పారు జగ్గారెడ్డి . అయితే, తప్పుకోవడం ఎందుకు…పొరపాట్లు సరిదిద్దుకుని పని చేసుకుని పోవాలి అని సర్దిచెప్జాపారు జానారెడ్డి, శ్రీధర్ బాబు. ఎవరికి వారు మాట్లాడుకుంటూ పోతే.. పార్టీకి నష్టం కాదా..? అని జానారెడ్డి అన్నారు. ప్రతీది అందరికి చెప్పాలని అనడం సరికాదని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అందరూ వస్తున్నారు… నాకు సమాచారం ఇస్తున్నారా..? అని పరోక్షంగా జగ్గారెడ్డిని ఉద్దేశించి అడిగారు అంజన్ కుమార్.. పదవితో కాదు… నేను కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని తెలిపారు జగ్గారెడ్డి. మనం మనం కొట్టుకోవడం కోసం కాదు మీటింగులు అని సర్దిచెప్పారు మధు యాష్కీ. పార్టీ యాక్షన్ ప్లాన్ పై చర్చ చేయండి. అంతర్గత సమస్యలు… అంతర్గతంగా చర్చ చేసుకోవాలని మధు యాష్కీ సూచించారు.
తాజావార్తలు
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!