Manchirevula : సొసైటీ వర్సెస్ శ్మశాన వాటిక కమిటీ..
- మంచిరేవుల భూమిపై వివాదం
- సొసైటీ–శ్మశాన కమిటీ మధ్య రగడ
- హైకోర్టు ఆదేశాలతో సర్వే
- భారీ పోలీసు బందోబస్తు
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవులలో ఉన్న సర్వే నంబర్ 491 భూమి ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ‘స్వస్తిక హౌసింగ్ సొసైటీ’ (Swastika Housing Society) , ‘నార్సింగి ఓల్డ్ ముస్లిం శ్మశాన వాటిక కమిటీ’ (Old Muslim Graveyard Committee) మధ్య ఈ స్థలం విషయంలో కొన్నేళ్లుగా రగడ సాగుతోంది. తాజాగా ఈ స్థలంలో సర్వే నిర్వహించడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
1982లో స్వస్తిక కోఆపరేటివ్ సొసైటీ సుమారు 4 ఎకరాల 18 గుంటల భూమిని హైదర్ అలీ మీర్జా అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2008లో ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణం కోసం ప్రభుత్వం ఇందులో 2 ఎకరాల 3 గుంటల భూమిని సేకరించింది. మిగిలిన 2 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో సొసైటీ సభ్యులు బౌండరీలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు, అదే సర్వే నంబర్లోని 2.3 గుంటల భూమిని హైదర్ అలీ తమకు దానం చేశారని, అది వక్ఫ్ బోర్డు గెజిట్లో కూడా ఉందని ముస్లిం శ్మశాన వాటిక కమిటీ వాదిస్తోంది.
Also Read
ఈ భూ వివాదం కోర్టుకు చేరడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గత మార్చిలో ఒకసారి సర్వే చేశారు. అనంతరం సొసైటీ సభ్యులు అక్కడ పహారీ గోడ నిర్మించి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, కొందరు దుండగులు తమ సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బెదిరిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం పోలీసులు, రెవెన్యూ, హెచ్ఎండీఏ (HMDA) , వక్ఫ్ బోర్డు అధికారులు భారీ బందోబస్తు మధ్య మళ్లీ సర్వే నిర్వహించారు.
Adani vs Ambani: అదానీ Vs అంబానీ .. 2025 లో ఎవరి సంపద పెరిగిందో తెలుసా!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో