Mallu Ravi: వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఫైర్.. చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం
Mallu Ravi Demands To Take Action On Komatireddy Venkata Reddy: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్కు నష్టం కలిగించే విధంగా వెంకటరెడ్డి మాట్లాడారని, ఇప్పటి స్టేట్మెంట్ బీజేపీకి అనుకూలంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తారని బండి సంజయ్ మాట్లాడటానికి.. వెంకటరెడ్డి వ్యాఖ్యలే కారణమని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి మాట్లాడే మాటలు కాంగ్రెస్ క్యాడర్ను గందరగోళం పరిచే విధంగా ఉన్నాయని, ఇది కాంగ్రెస్ కార్యకర్తలని అసంతృప్తికి గురిచేస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వెంకటరెడ్డి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK Aruna: బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం.. మేం చెప్పింది నిజమని రూఢీ చేసేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పదేపదే బీజేపీకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది క్రమశిక్షణను ఉల్లంఘించటమేనని మల్లు రవి పేర్కొన్నారు. వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధిష్టానానికి లేఖ రాస్తామన్నారు. గతంలోనూ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చామని, అయితే ఆ నోటీసుని చెత్త బుట్టలో వేసేశారని చెప్పారు. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోటీ చేసినప్పుడు.. కాంగ్రెస్కు తీవ్ర నష్టం కలిగించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ గతంలోనే స్పష్టం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందని వెంకటరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వెంకటరెడ్డిపై చర్యలు తీసుకొని, కాంగ్రెస్ను కాపాడాల్సిందిగా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
Cheteshwar Pujara: అరుదైన రికార్డుకు చేరువలో పుజారా.. రెండో టెస్టు ఆడితే!
ఇదిలావుండగా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్వంతంగా 60 సీట్లు దక్కవని, అప్పుడు కాంగ్రెస్తో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు సెక్యులర్ పార్టీలని.. అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవి పైవిధంగా స్పందించారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!