Mynampally: రెండు టికెట్లు ఇస్తా అన్నారు.. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్లో చేరుతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mynampalli: కాంగ్రెస్లో మాకు రెండు టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్లో చేరుతా అని మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నా అని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్లో చేరుతా అని క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే నాకు గౌరవం అన్నారు. వాళ్ళ నుంచి నేను ఎన్నో ఆదర్శాలను నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చేరిన తర్వాత హైదరాబాద్లో సోనియాగాంధీతో సభ ఉంటుందని మైనంపల్లి తెలిపారు.
ఇక తాజాగా.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియోను రిలీజ్ చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మైనంపల్లి ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ నిరాకరిస్తున్నానని.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మైనంపల్లి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. “నేను భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నేను నా నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ను తిరస్కరించాను. నా మద్దతుదారులు మరియు నియోజకవర్గాలతో చాలా చర్చలు మరియు సంప్రదింపుల తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరినప్పుడు.
Also Read
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో GHMCలో ఒక్క కార్పొరేటర్ లేకుండా మల్కాజిగిరి లోక్సభ స్థానంలో ఎదురుగాలులు వీస్తున్నాయి.పార్టీ కోసం,ప్రజల కోసం కష్టపడ్డాను.గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 2016 GHMC ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం కోసం.. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యానని తెలిపారు.. దాని పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదు. పార్టీ నాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకాభిప్రాయం, సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. పార్టీ శ్రేణుల అధిష్టానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడమే ఇందుకు నిదర్శనం అన్నారు. పార్టీలో నేను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలు, పదవుల నుండి నన్ను తొలగించాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మీ పార్టీ అభ్యర్థుల జాబితా నుండి నా పేరును ఉపసంహరించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో మీరు అందించిన సహకారం, మద్దతుకు ధన్యవాదాలు’ అని మైనంపల్లి హనుమంతరావు తన రాజీనామా లేఖలో రాశారు.
KTR: ముస్లిం శ్మశానవాటికలకు 125 ఎకరాలు.. వక్ఫ్బోర్డు ఛైర్మన్కు పత్రాలు అందజేసిన కేటీఆర్
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!