Maheshwar Reddy: కవిత తప్పు చేయకపోతే.. రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవచ్చు కదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy Demands Kavitha To Resign MLC Post And Prove Her Honesty: సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తాజాగా స్పందించారు. లిక్కర్ స్కామ్లో ఎవరున్నా, సీబీఐ విచారణలో బయటపడుతుందని.. కవిత ప్రమేయంపై సీబీఐ విచారణ చేస్తుందని.. అప్పుడు వాస్తవాలు బయటపడతాయని అన్నారు. కవిత నిజంగా తప్పు చేయకపోతే.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవచ్చు కదా? అని నిలదీశారు. ‘వివేక్ ఒబెరాయ్ హోటల్లో జరిపిన చర్చలు వాస్తవం కాదా? వాస్తవం కాకుంటే నిరూపించుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మొన్నటివరకు మిత్రులుగా మెలిగారని.. ఇప్పుడు అధికార దాహంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్లో కవిత హస్తం ఉందని ఢిల్లీలో బీజేపీ పర్వేశ్ శర్మ ఆరోపణలు చేశారని, ఈ స్కామ్లో వందల కోట్లు చేతులు మారాయని అన్నారని, ఢిల్లీలో సిసోడియాతో కవిత మీటింగ్ నిర్వమించారని చెప్తున్నారని ఆయనన్నారు. 10 శాతం కమిషన్ పెరగడం వల్లే వందల కోట్లు చేతులు మారాయని.. దీనిపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని కోరారు. పంజబ్, ఢిల్లీ, తెలంగాణలో ఎంతపెద్ద కుంభకోణం జరుగుతుందో స్పష్టమవుతోందన్నారు. 2021 నవంబర్ కొత్త విధానాల పేరుతో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణకి చెందిన ఓ బడా మద్యం వ్యాపారి తెరవెనుక ఉండి, కవితను ముందు పెట్టి ఇదంతా నడిపించారని అభిప్రాయపడ్డారు.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ఈ స్కామ్లో కవిత పాత్ర లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం నిజానిర్ధారణ కమిటీ వేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నుండి కవితను తప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. ఈ స్కామ్లో చాలా అనుమానాలున్నాయని చెప్పారు. ఢిల్లీ మాదిరి రాష్ట్రంలో కూడా ఎంక్వయిరి వేయాలన్నారు. టెండర్లలో సిండికేట్ అయి, బ్లాక్ లిస్ట్లో కంపెనీలు దక్కించుకున్నాయన్నారు. మద్యం రేట్లు పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. 30 వేల కోట్లలో 12 వేల కోట్ల రెవెన్యూ వచ్చిందని ప్రభుత్వం చెప్తోందని.. వెంటనే ఈ విధానాలు మార్చి, గతంలో ఉన్న విధానాన్ని తీసుకురావాలని ఆయన అడిగారు. ఫీనిక్స్పై జరుగుతున్న దాడుల్లో మంత్రి కేటీఆర్ పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఓ సామాన్య కంపెనీ అయిన ఫీనిక్స్, ఇప్పుడు లక్షల కోట్ల బిజినెస్ చేస్తోందని.. దీని వెనక ఎవరి స్నేహ హస్తముందని ప్రశ్నించారు.
70 వేల కోట్ల విలువైన భూములను ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, దీనిపై కూడా సీబీఐ విచారణ జరపాలని మహేశ్వర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైర్మన్ చుక్కపల్లి సురేష్, డైరెక్టర్లు కేటిఆర్కి బంధువులన్నారు. ముంబై నుండి 30 గ్రూపులుగా ఐటీ దాడులు చేస్తున్నాయని, ఐటీ దాడుల వల్ల వాస్తవాలు బయటకు రావని.. నిజానిర్ధారణ కమిటీ వేసి సీబీఐ విచారణ జరపాలని ఆయన అడిగారు. ఇక ఇదే సమయంలో.. తెలంగాణలో 12 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్రచేయనున్నారని, ఇది దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి ‘హిట్ మ్యాన్’..
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!