Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్నాథ్ సవాల్..
- రాహుల్ గాంధీ ‘‘ఓటు చోరీ అణుబాంబు’’ వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలకు రాజ్నాథ్ సింగ్ కౌంటర్..
- దమ్ముంటే ఆ అణుబాంబు పేల్చాలని సవాల్..
Rajnath Singh: ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు. “రాహుల్ గాంధీ తన వద్ద అణు బాంబు ఉందని చెబుతున్నారు. అలా అయితే, అతను దానిని వెంటనే పేల్చాలి. అతను తనకు హాని జరగకుండా చూసుకోవాలి” అని ఎద్దేవా చేశారు.
Read Also: IND vs ENG: భారత్ది కూడా ‘బజ్బాల్’ ఆటే.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్! ఆధిక్యం 166
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
బీజేపీకి ఎన్నికల కమిషన్ ‘‘ఓటు దొంగతనం’’ చేసిందని నిరూపించడానికి తన పార్టీ వద్ద ‘‘అణుబాంబు’’ ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. భారత ఎన్నికల కమిషన్ ప్రశ్నించలేని సమగ్రతకు పేరుగాంచిన సంస్థ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
బీహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని, రాజ్యాంగ సంస్థ గురించి పనికిమాలిన ప్రకటనలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని రాజ్నాథ్ అన్నారు. ఆయన సొంత పార్టీ చేతులకే రక్తం ఉందని, 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. బీహార్లో గత 20 ఏళ్ల పాలనలో నితీష్ కుమార్ అభివృద్ధి చేశారని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!