Madhu Yaskhi: ‘ఫ్రంట్’ సినిమాకు డైరెక్టర్ పీకే, నిర్మాత మోడీ.. నటుడు కేసీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్చాట్లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ.. నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కుటుంబ పాలనకు వ్యతిరేకం కాదు.. కుటుంబ దోపిడీకి వ్యతిరేకం అన్నారు యాష్కీ.. వైఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు అసోం అధికారులు ఉన్నారు.. ఐఏఎస్లు బీపీ ఆచార్యలు.. శ్రీలక్ష్మిలు అవుతారన్న ఆయన.. మా పోరాటం సీఎంపైనే.. కానీ, అధికారుల మీద కాదన్నారు.
Read Also: JNTUH Exams: సందిగ్ధంలో జేఎన్టీయూ పరీక్షలు..!
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
కాంగ్రెస్ జాతీయ పార్టీ.. రీజినల్ పార్టీ కాదన్న మధుయాష్కీ.. అవినీతిలో ఆంధ్ర.. బీహార్ అధికారి అని ఉండదు.. తెలంగాణ ఐఏఎస్ లకు పదవులు ఇచ్చేది సీఎం కదా..? అని ప్రశ్నించారు. ఒక్కో అధికారికి అన్ని శాఖలు ఇచ్చిన సీఎంది తప్పన్న ఆయన.. కేసీఆర్ని నేను దొర లెక్క చూస్తానన్నారు.. ఇక, డీజీపీ మహేందర్ రెడ్డి… కిరణ్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ శ్రీధర్ లు అత్యంత సన్నిహితులన్నారు యాష్కీ.. ఇప్పుడు కేసీఆర్కి సన్నిహితులుగా మారారని.. ఐఏఎస్ ల కోసం కాదు… ఉద్యోగాల ఖాళీల గురించి కొట్లాడాలన్నారు.. తెలంగాణకు ద్రోహం చేస్తుంది కేసీఆరేనని మండిపడ్డ ఆయన.. అధికారుల గురించి ఎందుకు.. నిరుద్యోగుల కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు.. తెలంగాణ వచ్చిన తర్వాత.. ఆంధ్రోళ్లు అంతా ఇక్కడే ఉన్నారు. సినిమాలు.. స్టూడియోలు అన్నీ వాళ్ల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక, భట్టి విక్రమార్క లెక్క గ్రామ గ్రామం తిరగాలని.. అప్పుడే పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ప్రచార కమిటీ తరుపున నియోజక వర్గం వారీగా అజెండా సిద్ధం చేస్తాం.. త్వరలో ప్రచార కమిటీ జిల్లా, నియోజక వర్గ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు మధు యాష్కీ గౌడ్.
తాజావార్తలు
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!