PM Modi: చర్మం రంగును బట్టి విలువ ఇస్తారా..! అందుకే ముర్మును వ్యతిరేకించారా..? అని పీఎం మోడీ కాంగ్రెస్ పై మండిపడ్డారు. చర్మము రంగును బట్టి యోగత్యను ఇస్తారా.. చర్మం రంగును బట్టి విలువ ఇస్తారా మీరే చెప్పండి అని ప్రశ్నించారు. వరంగల్ సభలో మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఆదివాసీ అయిన ద్రపతి ముర్మ్రును ఒడగొట్టే కాంగ్రెస్ ప్రయత్నం ఎందుకు అని ఆలోచిస్తే… అప్పుడు అర్థం కాలేదు.. కానీ ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. నల్లగా ఉన్న ముర్ము ఆఫ్రికా వాసి అని, ఆమెను ఒడగొట్టేందుకు ప్రయత్నం చేశారు అనుకుంటున్న అని తెలిపారు. చర్మం రంగు బటీ విలువ ఇస్తున్న రాజకుమారుడు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో చేసి నష్టాన్ని రైతులు భరించాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పును ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు.
Read also: Sanju Samson Out: సంజూ శాంసన్ ఔట్తోనే మ్యాచ్ ఓడిపోయాం: కుమార సంగక్కర
కానీ రైతుల కోసం బీజేపీ ప్రభుత్వం పని చేస్తుంది.. రైతుల శ్రేయస్సు కోసం రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభించామన్నారు. టెక్ట్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తే అది పూర్తి స్థాయిలో పని చేయకుండా చేస్తున్నారని తెలిపారు. ఇవి అన్ని పోవాలంటే అరురి రమేష్.. సీతారాం నాయక్ కి ఓట్లు వేయండి గెలిపించండి మోడీ కి బలం చేకూర్చింది… మిగిలిన వాళ్లు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ అమరవీరులకు ఇస్తా అన్న హామీ అమలు చేశారా? అని ప్రశ్నించారు. విద్యుత్ కోతలు ఉన్నాయి.. మహిళలు ఇస్తా అన్న 2500 నగదు ఇవ్వలేదన్నారు. ఇలా హామీ లు అమలు చేయని కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏమి లాభం అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మొత్తం ఆగిపోయిందన్నారు. తెలంగాణ నిధులు ఎటు వెళ్లాయన్నారు. డబుల్ అర్ టాక్సీ పేరుతో నిధులు వెళుతున్నాయి అనే ప్రచారం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న నేతల్లో ఇండ్లలో డబ్బులు బయట పడుతున్నాయన్నారు.
Read also: Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్
నేతల బ్లాక్ మనిని బయటకు తీస్తే.. కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారు. రిజర్వేషన్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ ను ముస్లిం లకు కాంగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న తీరును కోర్టు అడ్డుకుందన్నారు. రిజర్వేషన్ తొలగించే తీరును మీరు అనుమతి ఇస్తారా? ఎస్సీ ఎస్టీ. బిసిల ఇచ్చే రిజర్వేషన్ పక్కకు పెట్టీ ముస్లిమ్ లకు మాత్రం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బడుగు బలహీనర్గాలకు రిజర్వేషన్ తో ఎదగకుండా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ కూడా ఏస్ సి.. ఎస్టీ.. బీసీ లను మోసం చేస్తుందన్నారు. దళిత ముఖ్య మంత్రి చేస్తా అని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. కానీ బీజేపీ పార్టీ చరిత్ర దళితులకు రాష్ట్రపతి చేసిన చరిత్ర అని తెలిపారు. భద్రకాళి అమ్మవారి రామప్ప ఆశీషులు తీసుకున్న కాకతీయ రాజుల పరాక్రమానికి ఈ ప్రాంతం అన్నారు.
Read also: Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మూడో దశలు పోలింగ్ పూర్తి అయ్యిందన్నారు. మూడో దశ పోలింగ్ పూర్తి అయ్యే సరికి ఎన్డీఏ గెలుపు దగ్గర అయ్యిందన్నారు. కాంగ్రెస్ గెలుపు ఎక్కడో వ్యతుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక నాలుగు దశ ముగిసే సరికి కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. వరంగల్ చాలా ముఖ్య మైన స్థానం.. దేశంలో రెండు సీట్లు గెలిస్తే.. వరంగల్ నుండి ఒక్క సీటు గెలిచామన్నారు. మాకు ఎప్పుడు కష్టం కాలం ఉన్న వరంగల్ మాకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఇనుప సంకెళ్ళు నుండి కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. భారతదేశం. అభివృద్ధి కోరుకుంటే.. మీ పిల్లల అభివృద్ధి కోరుకుంటే .. పొరపాటు చేయకండి మరొక్కసారి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ లో ఎలాంటి అవినీతి జరిగిందో మీకు తెలుసన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయన్నారు. ఏడాది కి ఒక్క ప్రధాని తెచ్చే కాంగ్రెస్ కావాల.. ఆలోచించాలన్నారు. కూటమి లో ఒక్కొక్క పార్టీకి ఒక ప్రధాని అభ్యర్థి ఉన్నారని తెలిపారు. ప్రతి పార్టీకి ఒక్కొక్క ప్రధాని మంత్రి ఉంటే దేశం బాగుపడుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతటి అబద్ధాలు చెబుతుందో తెలంగాణ ప్రజలకు తెలిసింత మరొక్కరికి తెలియదన్నారు. కాంగ్రెస్ రుణ మాఫీ పైనా మాట తప్పిందన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తా అని చెప్పి అది వాయిదా వేయలేదా? అని ప్రశ్నించారు.
PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్.. హైదరాబాద్ని ఎంఐఎంకి రాసిచ్చింది..