తెలంగాణలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోగా.. మారికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కెబినెట్ నిర్ణయించింది.