Laddu Donga: వినాయక లడ్డూ చోరీ.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి అంటే మామూలుగా వుండదు.. వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేయడం కామన్. వినాయకుడికి పెట్టే లడ్డూ కూడా చాలా ఫ్యామస్. ఈ లడ్డూని వేలం వేసి లక్షలు పాడుకుంటారు. అలాంటిది విఘ్ననాయకుడి లడ్డూని కొట్టేశాడో దొంగ. అదీ కూడా పబ్లిక్ గా.. సీసీ కెమేరా సాక్షిగా ఆ దొంగ చేసిన పని ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ అవుతోంది.
జగిత్యాల పట్టణంలో హనుమాన్ వాడ హనుమాన్ దేవాలయం లో వినాయక విగ్రహం ఏర్పాటుచేశారు. ఎప్పటి లాగే వినాయకుడికి లడ్డూ కూడా ప్రసాదంగా పెట్టారు. కానీ ఈ లడ్డూ చోరీకి గురి కావడంపై భక్తులు మండిపడుతున్నారు. స్థానిక హనుమాన్ వాడ లోని హనుమాన్ దేవాలయంలో గల వినాయకుని మండపం లోని గణేష్ లడ్డూ చోరీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. తాపీగా వచ్చిన ఒక దొంగ మండపంలోని వినాయక విగ్రహం దగ్గరికి వెళ్ళి.. వినాయకుడి చేతిలోని లడ్డూ కాజేశాడు. లడ్డూ కోసం వచ్చిన దొంగ ముసుగు వేసుకుని వచ్చాడు. లడ్డూ చోరీ చేసుకుని నింపాదిగా అక్కడినుంచి జారుకున్నాడు. మెడలో కండువా, ముసుగు, అతని డ్రెస్ ఆధారంగా ఆ దొంగ పని పట్టే పనిలో వున్నారు పోలీసులు.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
Read Also: Thirty Five Years for Swayamkrushi : మూడున్నర పదుల ‘స్వయంకృషి’
రెండురోజుల క్రితం సిరిసిల్ల జిల్లా, గోపాల్ నగర్ మండలంలో ఉన్న గణనాథున్ని ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం కలిగించింది. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు, నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయారు. వినాయక మండపానికి తలుపులు లేకపోవడంతో అలాగే వదిలేశారు. సాధారణంగా వినాయక మండపంలో పూచిక పుల్ల కూడా కదలదు. ఎవరైనా వస్తే ప్రసాదం తీసుకువెళతారు. అది కూడా అర్థరాత్రి కావడంతో నిర్వాహకులు ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున నిర్వాహకులు మండపానికి వచ్చి చూసేసరికి అవాక్కయ్యారు. వినాయక విగ్రహం అక్కడ కనిపించలేదు. వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం కనిపించకపోవడంతో అందరం బాధపడ్డామని స్థానికులు చెప్పారు. ఆలయాల్లో హుండీ ఎత్తుకెళ్లడం కామన్.. డబ్బులు, బంగారం, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురి అవుతుంటాయి. కానీ దేవుడినే మింగే దొంగలున్నారని, తస్మాత్ జాగ్రత్త అని ఇతర మండపాల నిర్వాహకులకు సలహాలు చెబుతున్నారు ఈ మండపం నిర్వాహకులు.
Read Also: Uttarakhand: పరువు హత్య.. అల్లుడిని దారుణంగా హత్య చేసిన అత్తమామలు
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!