Laddu Donga: వినాయక లడ్డూ చోరీ.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి అంటే మామూలుగా వుండదు.. వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేయడం కామన్. వినాయకుడికి పెట్టే లడ్డూ కూడా చాలా ఫ్యామస్. ఈ లడ్డూని వేలం వేసి లక్షలు పాడుకుంటారు. అలాంటిది విఘ్ననాయకుడి లడ్డూని కొట్టేశాడో దొంగ. అదీ కూడా పబ్లిక్ గా.. సీసీ కెమేరా సాక్షిగా ఆ దొంగ చేసిన పని ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ అవుతోంది.
జగిత్యాల పట్టణంలో హనుమాన్ వాడ హనుమాన్ దేవాలయం లో వినాయక విగ్రహం ఏర్పాటుచేశారు. ఎప్పటి లాగే వినాయకుడికి లడ్డూ కూడా ప్రసాదంగా పెట్టారు. కానీ ఈ లడ్డూ చోరీకి గురి కావడంపై భక్తులు మండిపడుతున్నారు. స్థానిక హనుమాన్ వాడ లోని హనుమాన్ దేవాలయంలో గల వినాయకుని మండపం లోని గణేష్ లడ్డూ చోరీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. తాపీగా వచ్చిన ఒక దొంగ మండపంలోని వినాయక విగ్రహం దగ్గరికి వెళ్ళి.. వినాయకుడి చేతిలోని లడ్డూ కాజేశాడు. లడ్డూ కోసం వచ్చిన దొంగ ముసుగు వేసుకుని వచ్చాడు. లడ్డూ చోరీ చేసుకుని నింపాదిగా అక్కడినుంచి జారుకున్నాడు. మెడలో కండువా, ముసుగు, అతని డ్రెస్ ఆధారంగా ఆ దొంగ పని పట్టే పనిలో వున్నారు పోలీసులు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
Read Also: Thirty Five Years for Swayamkrushi : మూడున్నర పదుల ‘స్వయంకృషి’
రెండురోజుల క్రితం సిరిసిల్ల జిల్లా, గోపాల్ నగర్ మండలంలో ఉన్న గణనాథున్ని ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం కలిగించింది. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు, నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయారు. వినాయక మండపానికి తలుపులు లేకపోవడంతో అలాగే వదిలేశారు. సాధారణంగా వినాయక మండపంలో పూచిక పుల్ల కూడా కదలదు. ఎవరైనా వస్తే ప్రసాదం తీసుకువెళతారు. అది కూడా అర్థరాత్రి కావడంతో నిర్వాహకులు ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున నిర్వాహకులు మండపానికి వచ్చి చూసేసరికి అవాక్కయ్యారు. వినాయక విగ్రహం అక్కడ కనిపించలేదు. వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం కనిపించకపోవడంతో అందరం బాధపడ్డామని స్థానికులు చెప్పారు. ఆలయాల్లో హుండీ ఎత్తుకెళ్లడం కామన్.. డబ్బులు, బంగారం, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురి అవుతుంటాయి. కానీ దేవుడినే మింగే దొంగలున్నారని, తస్మాత్ జాగ్రత్త అని ఇతర మండపాల నిర్వాహకులకు సలహాలు చెబుతున్నారు ఈ మండపం నిర్వాహకులు.
Read Also: Uttarakhand: పరువు హత్య.. అల్లుడిని దారుణంగా హత్య చేసిన అత్తమామలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!