Kunamneni: పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి అనుకూలంగా ఓటు రావడం లేదని తెలిపారు. పార్టీని పెంచుకోవాలని నిర్ణయించామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి కాంగ్రెస్ అని తెలిపారు. పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని అన్నారు. నల్గొండ, భువనగిరి,…
పొత్తులు పొత్తులే... పోరాటాలు పోరాటాలే... ప్రజల కోసమే పోరాటమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు అన్నారు. ప్రధాని పర్యటన పలుచగా జరిగిందని, ప్రధాని హోదా రాష్ట్రానికి ఏమివ్వలేదన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిలువరించాలనేది మా ప్రధాన ఎజెండా అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని మండిపడ్డారు.