KTR: మతం పేరుతో రాజకీయం చేస్తే వారిని నమ్మకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం వెంకంపేట చౌరస్తాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. మా ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేది, ఇప్పుడు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వకుండా నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందన్నారు. నాలుగు నెలల్లో లక్ష పెళ్ళిల్లు జరిగినవి వారికి లక్ష, తులం బంగారం, 4000 పింఛన్ వచ్చిందా? అని ప్రశ్నించారు.
పార్లమెంటులో గట్టిగా కొట్లాడే వినోద్ కుమార్ గెలిపించాలన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నేను ఓట్లు అడిగిన్నా? అని ప్రశ్నించారు. గుళ్ళు కట్టుడే ప్రాచీన శిల్ప కళకు అద్దం పట్టేలా యాదాద్రి కట్టిండన్నారు. కేసీఆర్ మిడ్ మనేరు కట్టి సిరిసిల్లలో సముద్రం తీసుకు వచ్చిండన్నారు. మోడీ నుండి ఒక్క రూపాయి అన్న లాభం జరిగిందా ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు.
Also Read
Read also: NEET Exam 2024: రేపే నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
బండి సంజయ్ గెలిచిన ఐదు సంవత్సరాలలో ఒక్క శిల ఫలకం అన్న వేసిండా? అన్ని ఫిరం చేసిన మోడీ ప్రభుత్వానికీ ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. భారతదేశంలో ప్రధానమంత్రి అనడంలేదు ఫిరమైన ప్రధానమంత్రి అంటున్నారని తెలిపారు. బీజేపీ ఒక్క పని అన్న సిరిసిల్ల లో అభివృద్ధి చూపెడితే దేనికైనా రెఢీ అన్నారు. చోట భాయ్, బడా భాయ్ కి ఓటు వేసి వేయకుండా వారికి బుద్ధి చెప్పండన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్ళు చేతులు లేపండి, నాకు నమ్మకం ఉంది వినోద్ కుమార్ గెలుస్తాడని అన్నారు. మతం పేరు మీద రాజకీయం చేసే వారిని నమ్మకండి అన్నారు. నిన్న జరిగిన సీఎం సభలోనే చేతి విగింది అని చంద్రకల అంటున్నది, కార్ రయ్యిమని ఊరుకాలే అన్నారు. ఈనెల 13 తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కార్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్న అన్నారు.
AP Elections 2024: అధికారుల పాపాల చిట్టా బయటకి తీస్తాం.. బుద్ధి చెపుతాం..!
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!