NEET Exam 2024: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్,పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
Read also: Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..
నిబంధనలకు, షరతులకు పరీక్ష నిర్వహణ కు సంబంధించిన నీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్ మంజుల దేవి వివరాలను వెల్లడించారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్నారు. పరీక్షకు 5205 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలున్నాయన్నారు.
ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకురావలసి ఉంటుందన్నారు.
Read also: Nagari: నగరిలో కొత్త పంచాయతీ..! మంత్రి రోజాకు రివర్స్ షాక్..!
NEET (UG) విద్యార్థులకు ముఖ్య సూచనలు..
1. NEET UG 2024 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డ్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాజరు పత్రంపై ఫోటో అతికించాలి.
2. అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి. పొడవాటి చేతుల దుస్తులు, బూట్లు, నగలు మరియు మెటల్ వస్తువులు లోపలికి అనుమతించబడవు.
3. చెప్పులు, తక్కువ ఎత్తు చెప్పులు మాత్రమే ధరించాలి.
4. పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్లు, ప్లాస్టిక్ పౌచ్లు, కాలిక్యులేటర్లు, స్కేల్స్, రైటింగ్ ప్యాడ్లు, పెన్ డ్రైవ్లు, ఎలక్ట్రానిక్ పెన్నులు మొదలైనవాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
5. వాచీలు, పర్సులు, హ్యాండ్బ్యాగ్లు, బెల్టులు, టోపీలు మొదలైన వాటిని ధరించవద్దు.
Read also: Nagari: నగరిలో కొత్త పంచాయతీ..! మంత్రి రోజాకు రివర్స్ షాక్..!
NEET UG పరీక్షా సరళి..
1. నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్లైన్ (పెన్, పేపర్) మోడ్లో నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు మరియు ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలతో మొత్తం 180 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి.
2. రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) నుండి ఒక్కో సబ్జెక్ట్ నుండి 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బిలోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. ఈ విషయంలో అభ్యర్థి సమాధానమిచ్చిన మొదటి 10 ప్రశ్నలు మాత్రమే గణన సమయంలో పరిగణించబడతాయి.
3. ప్రతి ప్రశ్నకు బహుళ ఎంపిక పద్ధతిలో నాలుగు ఐచ్ఛిక సమాధానాలు ఉంటాయి. ఒక సరైన సమాధానం గుర్తించాలి. సరైన సమాధానమిచ్చిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.
4. మొత్తం 720 మార్కుల ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)కి సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయి.
Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..