KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది
- కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు
- మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది
- అబద్ధానికి ఆడంబరం ఎక్కువ.. కానీ, ఆయుష్షు తక్కువ
- అబద్ధాలతో అద్భుతమైన నిజాలను చాలా కాలం దాచలేదు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. “నిజం నిలకడ మీద తెలుస్తుంది” అనే నానుడి నేడు నిజమైందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం తప్పని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై , కేంద్రంలోని బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం కుంగిపోయిందని రాష్ట్రమంతా తిరిగిన రేవంత్ రెడ్డికి (పిట్టల దొర) హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తాను మొదటి నుంచీ ‘పీసీసీ రిపోర్ట్’ అని పిలుస్తున్నానని, నేడు కోర్టు తీర్పుతో అది నిజమని నిరూపితమైందని అన్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఏ విధంగా వాదించినా, చివరకు సత్యమే గెలిచిందని, నిప్పులాంటి నిజం బయటకు వచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది బిఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుకు అయిన మొత్తం ఖర్చు 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోలేదని, రాజకీయ లబ్ధి కోసం వీళ్లే కూల్చారనే విషయం త్వరలోనే బయటపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రాజెక్టులు కట్టడమే నేరమన్నట్లుగా ప్రచారం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ఆఘమేఘాల మీద స్పందించిన ఎన్డీఎస్ఏ (NDSA), మరి ఎస్ఎల్బీసీ (SLBC) కూలినప్పుడు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినప్పుడు ఎక్కడకు పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద ఉన్న వ్యక్తిగత కక్షతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
2014 ముందు , కేసీఆర్ పాలన ముగిసే నాటికి పెరిగిన పంట దిగుబడే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి నిదర్శనమని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలు పక్కన పెట్టి, కాళేశ్వరం నీళ్లను లిఫ్టింగ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రచారాలు మాని, పరిపాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!