KTR: అప్పు తప్పు అన్నవారే అప్పులు ఎందుకు చేస్తున్నారు.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండు ముఖ్యమైన అంశాలు ప్రజల దృష్టికి తీసుకురావాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. రైతులు కష్టాల కడగండ్లలో ఉన్నారు.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దైనియమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు లు స్తంభించిపోయాయని అన్నారు. పర్యవేక్షించే వ్యవస్థ లేదన్నారు. కామారెడ్డి లో రైతులు రోడ్లు ఎక్కరని తెలిపారు. హమాలీ లా కొరత ఉందన్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక్క దగ్గర కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి అన్నారు. రైతులు ఆందోళనలో ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.
Read also: Sonakshi Sinha: పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా: సోనాక్షి సిన్హా
Also Read
- Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
ఇరువై ఐదు,ముప్పై రోజులుగా ధాన్యం తీసుకు వచ్చిన కొనుగోలు చేయడం లేదన్నారు. తడిసిన దాన్యం,తరుగు లేకుండా FCI ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు.. క్వింటాల్ కి బోనస్.. రుణమాఫీ అయ్యేంత వరకు మేము రైతుల వెంట ఉంటామన్నారు. అవసరం అయితే రైతుల కోసం ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తాం..రోడ్ల మీదకు వస్తామన్నారు. ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ లలో గత 4 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఆ జిల్లాల పట్టభద్రులు గెలిపిస్తారని నమ్ముతున్నామని తెలిపారు. విద్యావంతుడు, ఉత్సాహావంతుడు రాకేష్ రెడ్డి నీ కేసిఆర్ బరిలో నిలిపారన్నారు. ఓటర్లకు మా విజ్ఞప్తి.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు విన్నారు.. ఐదు నెలల పాలన లో ఎలా దగ్హ చేశారో చూశారన్నారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అన్నారు ఏ మాట నిలబెట్టుకోలేదన్నారు. టెట్ కోసం గతంలో 4వందల ఫీజు ఉంటే.. ఐదు రెట్లు పెంచి రెండు వేలు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు.. వసతుల కోసం నిబద్ధతతో పని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఐదు నెలలు కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూశారన్నారు. నల్గొండలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేకుండే.. తీసుకువచ్చింది కేసిఆర్ అని గుర్తుచేశారు.
Read also: Health Tips: బరువు తగ్గాలంటే ఈ నీరు రోజూ తాగండి..
సీఎం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఐదు నెలల కాలపరిమితి ముగిసిందన్నారు. మరో ఏడు నెలల కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుక కావాలి అంటే రాజేష్ రెడ్డి నీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయులర్.. ఎప్పటికప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదన్నారు. ఆయన్ను గెలిపిస్తే మరో నయీంగా మారుతాడన్నారు. ఒక బ్లాక్మెయిల్ ను గెలిపించాము.. ఆయన పాలన ఎలా ఉందో చూస్తున్నామన్నారు. టీవీ చానెళ్లు అడ్డుపెట్టుకొని బెదిరించే మరో బ్లాక్మెయిల్ ను గెలిపించకూడదన్నారు. చిల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడన్నారు. కేసిఆర్ సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడిపారన్నారు. రేవంత్ రెడ్డి ముఖం బాగోలేక అద్దం పగలగిట్టుకున్నాట్లు ఉందన్నారు. నిన్న నారాయణ ఖేడ్ లో టీచర్ లా మీద పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారని తెలిపారు. వారు ఎన్నికల్లో పాల్గొన్నందుకు తగిన వేతనం ఇవ్వాలని అడగడం తప్పా? అన్నారు. మూడు లక్షల 89 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు అని FRBM చెప్పిందన్నారు. ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు. అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారు.
NTR : షూటింగ్ కు బ్రేక్..బర్త్ డే వేకెషన్ కు ఎన్టీఆర్..
తాజావార్తలు
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!