KTR : మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- విద్యార్థుల మృతిపై సీఎం రేవంత్ను ఎండగట్టిన కేటీఆర్
- గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
- "ఒక తండ్రిగా అడుగుతున్నా..." అంటూ భావోద్వేగంగా స్పందించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖను కూడా అందిపుచ్చుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఈ విషయంలో ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, రాష్ట్ర మంత్రులు కేవలం కంటి తుడుపు చర్యలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రతిసారి పక్కదారి పట్టించే ప్రయత్నమే చేశారని ఆరోపించారు.
ENG vs IND: ‘ఒక్క ఛాన్స్’ ప్లేయర్ ఔట్.. నాలుగో టెస్ట్ భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
“పిల్లలు కలిగిన ఒక తండ్రిగా అడుగుతున్నా… కనీసం ఒక తండ్రిగా అయినా సీఎం స్పందించాలి,” అంటూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. “మీ పిల్లలకు ప్రభుత్వం విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటారా?” అంటూ ప్రశ్నించారు.
ఇన్ని దారుణ ఘటనలు జరుగుతున్నా, ఇప్పటికీ బాధ్యత ఎవరిది అనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే, ఇప్పుడు కూడా ఎవరు బాధ్యులు? ఎవరిని ఉరితీయాలో చెప్పాలి,” అంటూ కేటీఆర్ విమర్శల ధాటిని కొనసాగించారు.
రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
Naga Vamsi : విజయ్ దేవరకొండను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!