KTR Tweet: టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలి.. కేటీఆర్ ఆసక్తికర ట్విట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ దీపాల పండుగ… మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ… దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈ దీపాల పండుగ… మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ… దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.#HappyDeepavali pic.twitter.com/87iFUgUOhi
— KTR (@KTRTRS) October 24, 2022
అనంతరం టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని మంత్రి కేటీఆర్ ట్విట్ ఆశక్తి కరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్క్ రాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు.
Read also: Janasena : మహిళా కమిషన్ చైర్ పర్సన్పై జనసేన ట్విట్టస్త్రాల వర్షం..
మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని. నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించి, ఫలితాలు నవంబర్ 6న వెల్లడి కానున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి ఆందోజు శంకరాచారి. పల్లె వినయ్ కుమార్ TJS నుండి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఎన్నికల్లోనూ ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో సీటు కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచారు. మునుగోడు యువతకు కేటీఆర్ ట్వీటర్ ద్వారా వీడియో పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
1/3 pic.twitter.com/lpRyHiLpeY— KTR (@KTRTRS) October 24, 2022
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!