Koti Deepotsavam 2025 Day 1: శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 1: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా మొదటి రోజు కార్యక్రమం జరిగింది. వేలాదిగా పాల్గొన్న భక్తుల శివనామస్మరణతో వేదిక మార్మోగింది.
కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశించనిచ్చే సంకేతంగా భావిస్తారు. కోటి దీపోత్సోవంలో మొదటి రోజులో భాగంగా.. దీప యజ్ఞం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రవచనామృతం వినిపించారు. ఆ తర్వాత.. వేదికపై సమస్త పుణ్య నదుల జలాలతో స్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం, కోటి మలెల్ల అర్చన నిర్వహించగా.. భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన గావించారు.
Also Read
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?

అనంతరం కాళేశ్వరం శ్రీముక్తేశ్వరస్వామి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. కళ్యాణ అనంతరం హంసవాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనం ఇచ్చారు. ముఖ్యంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామిజీ (శృంగేరి శారదాపీఠం) వారిచే అనుగ్రహభాషణం భక్తులను అలరించింది. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో మొదటి రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవతంగా ముగిసింది. ప్రతి దీపం ఒక భక్తుని ఆత్మజ్యోతి అనే భావనను ప్రతిబింబించిన ఈ కోటి దీపోత్సవం, కార్తీకమాస భక్తి వైభవానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈనెల 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..
Indus Waters Treaty: గన్స్, మిస్సైల్స్ అవసరం లేదు.. పాకిస్తాన్ను దెబ్బతీయాలంటే “సింధూ” చాలు
Pics from Day-1 of #Kotideepotsavam2025#BhakthiTV #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/9fCXNeKH5q
— BhakthiTV (@BhakthiTVorg) November 1, 2025
కోటిదీపోత్సవ ప్రాంగణంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారిచే కాశీ స్ఫటిక లింగానికి అభిషేకం..#BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/VIjtIFVyHj
— BhakthiTV (@BhakthiTVorg) November 1, 2025
తాజావార్తలు
-
Jana Nayagan: ఆ రెండు డేట్స్ లోనే ‘జన నాయగన్’.?
-
Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!
-
OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్?
-
UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో