Indus Waters Treaty: గన్స్, మిస్సైల్స్ అవసరం లేదు.. పాకిస్తాన్ను దెబ్బతీయాలంటే “సింధూ” చాలు
- సింధూ నది జలాలను ఆపితే పాకిస్తాన్లో నీటి కొరత..
- వ్యవసాయంపై పెను ప్రమాదం..
- సింధూ జలాల ఒప్పందంపై ఆస్ట్రేలియా రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘‘సింధూ నది ఒప్పందాన్ని’’ నిలిపేసింది. సింధూ నది జలాలను ఆపితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ బీరాలు పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన నివేదికలో సింధూ నది జలాలు ఆపితే, పాకిస్తాన్కు తీవ్రమై దెబ్బ పడుతుందని చెప్పింది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్-2025 పేర్కొంది.
Read Also: Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
పాకిస్తాన్ లోకి సింధూ, దాని ఉపనదులు పశ్చిమ దిశ ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని, సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడం ద్వారా భారత్కు ఇస్తుందని పేర్కొంది. ఈ పరిణామం పాకిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ అని, పాక్లోని వ్యవసాయంలో 80 శాతం సింధూ నది వ్యవస్థపై ఆధారపడి ఉందని చెప్పింది. కీలక సమయాల్లో చిన్న అంతరాయాలు కూడా పాకిస్తాన్ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయని, పాకిస్తాన్ నీటిని నిల్వ చేసుకునే నిల్వ స్థలం కూడా లేదని చెప్పింది. దాయాది దేశం సొంత ఆనకట్ట సామర్థ్యం సింధూ ప్రవాహాన్ని దాదాపు 30 రోజలకు మాత్రమే కలిగి ఉందని నివేదిక హైలెట్ చేసింది.
సింధూ ప్రవాహాలకు అంతరాయం కలిగిస్తే అది పాకిస్తాన్ ఆహారభద్రతకు ముప్పు కలిగిస్తుందని, తర్వాత జాతీయ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని నివేదిక చెప్పింది. భారత్ నిజంగా సింధూ ప్రవాహాలను తగ్గిస్తే పాకిస్తాన్లోని జనసాంద్రత కలిగిన ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి. భారత్ ప్రస్తుత మౌలిక సదుపాయాలు నదులు ప్రవాహాలను ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చిన్న అంతరాయాలు కూడా పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని కదేలు చేస్తాయని చెప్పింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!