Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
- నాపైనే ఎందుకు చర్యలు?
- గత నేతల వ్యాఖ్యలపై ప్రశ్నలు
- సీఎంను కలవడం కష్టమే
- కాంగ్రెస్కు సురేఖ కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై బాధ లేదు కానీ, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తన వివరణ కోరకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి తనపై చర్యలు తీసుకోవడం బాధాకరమని, తన మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి?
కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టిన కొండా సురేఖ, గతంలో పలువురు సీనియర్ నేతలు పార్టీని విమర్శించినా లేని చర్యలు తనపైనే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. “గతంలో మల్లు రవి కూడా పార్టీని తిట్టారు, రోశయ్య సైతం ‘విధవ రాజ్యం ఏలుతోంది’ అని వ్యాఖ్యానించారు, టీపీసీసీ అధ్యక్ష పదవిని ₹50 కోట్లు పెట్టి కొన్నారని మాట్లాడిన వారిపై ఎలాంటి చర్యలు లేవు” అని గుర్తుచేశారు. నిన్నటికి నిన్న పార్టీకి నష్టం కలిగించేలా కొందరు మాట్లాడినా వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, కానీ తన విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
- Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
సహాయం పొందినవారే నేడు విమర్శిస్తున్నారు
తమ నియోజకవర్గానికి వచ్చి తమ కాళ్లు మొక్కి, నియోజకవర్గం అంతా తిరిగిన వారే ఈరోజు తమపై విమర్శలు చేస్తున్నారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మాటను ఆయన భార్యే వినదు, కానీ ఆయన కూడా ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. పార్టీలోని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించిన ఆమె, అందరూ తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని, బయటకు వచ్చి తమ సమస్యలను బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు.
సీఎంను కలవడానికి సమయం దొరకదు
ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సురేఖ, ముఖ్యమంత్రిని కలవడానికి కనీసం సమయం కూడా దొరకడం లేదని ఆరోపించారు. సీఎం ప్రెజెంటేషన్లు లేదా పిటిషన్లు అసలు తీసుకోరని, తీసుకున్నా సంతకాలు చేయరని, ఒకవేళ సంతకం చేసినా ఆ పనులు కావని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని తాను అడగనని, అయితే నగర కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న తరుణంలో సీఎం తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. “ఆయనకు ఆయనే సీఎంగా చెప్పుకోవడం తప్పు కాదా?” అని ప్రశ్నించిన ఆమె, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టెక్కాలంటే అందరినీ కలుపుకొనిపోవాలని, ఇష్టారాజ్యంగా మోనోపోలీగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తాను పంపిన రహస్య లేఖను బయట ఎవరికీ ఇవ్వలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!