Komatireddy Venkat Reddy: మంత్రి జగదీశ్కి వెంకటరెడ్డి సవాల్.. చేయగలవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Challenges Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే భట్టి విక్రమార్కలాగా పాదయాత్ర చేయాలని ఛాలెంజ్ చేశారు. నల్లగొండ జిల్లా మల్లేపల్లి వద్ద భట్టి పాదయాత్రలో పాల్గొన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్లో సీఎం కావాలంటే మొదట ఎమ్మెల్యే కావాలని, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేతో సహా సీఎం వరకు అందరు సమానమేనని అన్నారు. కానీ బీఆర్ఎస్లో పరిస్థితి భిన్నంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను మొదటి నుండి ఎండగడుతున్న నేత భట్టి విక్రమార్క ఒక్కరేనని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల కోసం భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.
Tamilisai Soundararajan: గర్భిణులు “రామాయణం” చదవడం పిల్లలకు మంచిది.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
నల్లగొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టాలని తాను ఆమెను విజ్ఞప్తి చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కాంగ్రెస్ హయాంలోనే వేగంగా జరిగాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసిందని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయ్యిందన్నారు. కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టినా, వేధించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల కోసం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న భట్టి పాదయాత్రపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. భట్టి విక్రమార్క తన స్వార్థం కోసం పాదయాత్ర చేయడం లేదని స్పష్టం చేశారు.
Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ నీ స్థాయి ఎంత? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా?
తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని, ఇది తెలంగాణ ప్రజల బాధ్యత అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల కంటే ఎక్కువ ఆస్తులు ఒక్క మంత్రి జగదీశ్ రెడ్డి సంపాదించాడని ఆరోపించారు. హత్య కేసు నిందితుల్లోనూ జగదీశ్ రెడ్డి ముద్దాయని చెప్పారు. మీ చరిత్ర విప్పుతామని ఛాలెంజ్ చేశారు. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలిపించాలని ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!