Komatireddy Venkat Reddy : నాది ఒకటే మాట.. ఒకటే బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Fire on BJP and TRS.
బీజేపీ, టీఆర్ఎస్లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చనిపోయునప్పుడు మూడు రంగుల జెండాను కప్పమని చెప్పానని, కోమటిరెడ్డిది ఒకటే మాట….ఒకటే బాట అని ఆయన అన్నారు. ప్రధాని మంత్రి మోడీకి కేసిఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానన్నారు. సోషల్ మీడియాలో నాపై అబద్దఫు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో నా చిత్తశుద్ధిని శంకించేలా, వ్యక్తిత్వ ఖననానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
అభివృద్ధి కోసం నేను పోరాడతానని, బొగ్గు గనుల కుంభకోణంపై కేసిఆర్ సమాధానం ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి సమస్యలు లేవని అందరం కలసికట్టుగానే ఉన్నామని, అధిష్టానం నిర్ణయాలతోనే ముందుకు సాగుతామన్నారు.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్