komatireddy Rajgopal Reddy: కోమటి రెడ్డి వ్యవహారంపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. కోమటి రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో సమావేశం ప్రారంభం అయింది. రాజగోపాల్ రెడ్ది వ్యవహారంపై జరుగుతున్న ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, నల్లగొండ ముఖ్య నేతలతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Uttar Pradesh Crime: 2009లో భర్తకు జైలు శిక్ష.. 2022లో ప్రాణాలతో తిరిగొచ్చిన భార్య
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
రాజగోపాల్ రెడ్ది పార్టీ వీడకుండా..చూడాలని గతవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో చర్చించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి నచ్చచెప్పేందుకు పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించినా.. ఆయన మెత్తబడలేదు. దీని తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు నచ్చచెప్పాలని చూసినా.. పార్టీని వీడేందుకే రాజగోపాల్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జగింపు చర్యలు ద్వారా ఫలితం రాకపోవడంతో.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే ఎలాంటి నష్టాలు ఉంటాయనే దానిపై.. నివారణ చర్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చర్చిస్తోంది.
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!