komatireddy Rajgopal Reddy: కోమటి రెడ్డి వ్యవహారంపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. కోమటి రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో సమావేశం ప్రారంభం అయింది. రాజగోపాల్ రెడ్ది వ్యవహారంపై జరుగుతున్న ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, నల్లగొండ ముఖ్య నేతలతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Uttar Pradesh Crime: 2009లో భర్తకు జైలు శిక్ష.. 2022లో ప్రాణాలతో తిరిగొచ్చిన భార్య
Also Read
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
- Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్పై బిగ్ ప్రశ్న.!
రాజగోపాల్ రెడ్ది పార్టీ వీడకుండా..చూడాలని గతవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్ నివాసంలో చర్చించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి నచ్చచెప్పేందుకు పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించినా.. ఆయన మెత్తబడలేదు. దీని తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు నచ్చచెప్పాలని చూసినా.. పార్టీని వీడేందుకే రాజగోపాల్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జగింపు చర్యలు ద్వారా ఫలితం రాకపోవడంతో.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడితే ఎలాంటి నష్టాలు ఉంటాయనే దానిపై.. నివారణ చర్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చర్చిస్తోంది.
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!