Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాదాపు 181 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అందరూ ఉమ్మడి ప్రకటన చేశారు. దేశంలోని యూనివర్సిటీల్లో నియామకాల విషయంలో కేవలం ఆర్ఎస్ఎస్ వ్యక్తులనే భర్తీ చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి రాహుల్ గాంధీ మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ విషయంపై దేశంలోని 181 మంది విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్లు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. దేశంలోని యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్లు మెరిట్ ప్రాతిపదికన జరగడం లేదని, ఆర్ఎస్ఎస్ లింకుల ఆధారంగానే రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్లు, ప్రకటనల ద్వారా తెలుసుకున్నాం.
Read Also:Andhra Pradesh: ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనపై వైస్-ఛాన్సలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘వైస్-ఛాన్సలర్లను చాలా కఠినమైన, పారదర్శక ప్రక్రియలో నియమిస్తారు. దీని కోసం సంబంధిత వ్యక్తి విద్యార్హత ఏమిటో చూడవచ్చు. యూనివర్శిటీని ముందుకు తీసుకెళ్ళడానికి తమకు పరిపాలన దక్షత ఉందా.. విద్యార్హతలేంటి.. వృత్తిపరమైన అనుభవం ఉందా అనేవి ఎంపిక ప్రక్రియలో ఇది పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఇలాంటి ఊహాజనిత విషయాలు మాట్లాడవద్దని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. వాస్తవాలు లేకుండా గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దంటూ సూచించారు.
Read Also:KTR: ఆరు గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి.. ఆడోళ్లకు,మగోళ్లకు గొడవ పెట్టారు..
ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం వల్ల విద్యా వాతావరణం చెడిపోతుందని విద్యావేత్తలు అన్నారు. వైస్ ఛాన్సలర్లు ఇలా రాశారు, ‘మేము మెరిటోక్రసీని నమ్ముతాము. ఉన్నత విద్యకు ఇది అవసరం. గత కొన్నేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో పురోగతిని ఉటంకిస్తూ, గత కొన్నేళ్లుగా అద్భుతమైన మార్పు వచ్చిందని వైస్ ఛాన్సలర్లు రాశారు. ఇప్పుడు మన యూనివర్సిటీల గ్లోబల్ ర్యాంకింగ్ మెరుగుపడింది. రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఉన్నత విద్యాసంస్థల పరువు తీశారని విద్యావేత్తలు అంటున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..