Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాదాపు 181 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అందరూ ఉమ్మడి ప్రకటన చేశారు. దేశంలోని యూనివర్సిటీల్లో నియామకాల విషయంలో కేవలం ఆర్ఎస్ఎస్ వ్యక్తులనే భర్తీ చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి రాహుల్ గాంధీ మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ విషయంపై దేశంలోని 181 మంది విద్యావేత్తలు, వైస్ ఛాన్సలర్లు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. దేశంలోని యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్లు మెరిట్ ప్రాతిపదికన జరగడం లేదని, ఆర్ఎస్ఎస్ లింకుల ఆధారంగానే రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్లు, ప్రకటనల ద్వారా తెలుసుకున్నాం.
Read Also:Andhra Pradesh: ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్
Also Read
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనపై వైస్-ఛాన్సలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘వైస్-ఛాన్సలర్లను చాలా కఠినమైన, పారదర్శక ప్రక్రియలో నియమిస్తారు. దీని కోసం సంబంధిత వ్యక్తి విద్యార్హత ఏమిటో చూడవచ్చు. యూనివర్శిటీని ముందుకు తీసుకెళ్ళడానికి తమకు పరిపాలన దక్షత ఉందా.. విద్యార్హతలేంటి.. వృత్తిపరమైన అనుభవం ఉందా అనేవి ఎంపిక ప్రక్రియలో ఇది పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఇలాంటి ఊహాజనిత విషయాలు మాట్లాడవద్దని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. వాస్తవాలు లేకుండా గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దంటూ సూచించారు.
Read Also:KTR: ఆరు గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి.. ఆడోళ్లకు,మగోళ్లకు గొడవ పెట్టారు..
ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం వల్ల విద్యా వాతావరణం చెడిపోతుందని విద్యావేత్తలు అన్నారు. వైస్ ఛాన్సలర్లు ఇలా రాశారు, ‘మేము మెరిటోక్రసీని నమ్ముతాము. ఉన్నత విద్యకు ఇది అవసరం. గత కొన్నేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో పురోగతిని ఉటంకిస్తూ, గత కొన్నేళ్లుగా అద్భుతమైన మార్పు వచ్చిందని వైస్ ఛాన్సలర్లు రాశారు. ఇప్పుడు మన యూనివర్సిటీల గ్లోబల్ ర్యాంకింగ్ మెరుగుపడింది. రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఉన్నత విద్యాసంస్థల పరువు తీశారని విద్యావేత్తలు అంటున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!