Kodanda Reddy: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లాలూచీకి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodanda Reddy Demands Kavitha To Prove Her Honesty: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య లాలూచీ కొనసాగుతోందని చెప్పడానికి తాజా పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి అభిప్రాయపడ్డారు. మునుగోడు సభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని అన్నారని, మరి హోంమంత్రి స్థాయిలో ఉన్న మీరు విచారణ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అలాగే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్యపాత్ర పోషించారని ఆధారాలతో సహా వార్తలొస్తున్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు చర్యలు తీసుకోవడం మానేసి కేవలం కవిత ఇంటి ముందు ధర్నాలతో కానిచ్చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో ఉండి కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని చూస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లాలూచీ ఉన్నట్టు స్పష్టమవుతోందని కోదండ రెడ్డి తెలిపారు.
కుంభకోణం జరిగిందని చెప్తోన్న మోదీ ప్రభుత్వం, ఆ వివరాల్ని బహిర్గతం చేయాలని కోదండ రెడ్డి కోరారు. అలాగే.. లిక్కర్ కుంభకోణంలో తన పాత్ర ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కవిత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించి బలం చూపించుకోవడం కాదని.. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి రెడీగా ఉండాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు వచ్చినప్పుడు.. చట్టసభల్లోనే రాజీనామా చేసేవారన్నారు. విలువలు గల కాంగ్రెస్ ప్రజలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బతుకమ్మను రాజకీయం చేస్తున్నారని.. కవిత అధునాతన బతుకమ్మగా మారిందని ఎద్దేవా చేశారు. కవితను బతుకమ్మతో పోల్చిన మాటల్ని ఉపసంహరించుకోవాలని.. లేకపోతే తెలంగాణ మహిళలు ఉపేక్షించరని కోదండ రెడ్డి హెచ్చరించారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!