Kodanda Reddy : 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడన్నారు. కేసీఆర్ సర్కార్ రైతు కష్టాలను పట్టించుకోలేదని, కరోనా సమయంలో కూడా రైతులు నిరంతరం పనిచేశారన్నారు. రైతులకు కరోనా కష్టాలు వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ సంవత్సరం ప్రభుత్వం వడ్లు కొనక రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారన్నారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫి హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. 7095 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు అంకెల గారడీకే పరిమితం అయ్యాయన్నారు.
Also Read : Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలకి చెక్ పెట్టే గొప్ప ఔషధం
భూ రికార్డ్ల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలం అయిందని, ధరణి పోర్టల్తో భూస్వాములకు న్యాయం జరిగిందన్నారు. చిన్నా సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతోందని, వ్యవసాయం చేయని భూములకు కూడా రైటుబంధు సాయం అందుతోందన్నారు. పంట నష్ట పరిహారం అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఆయన ధ్వజమెత్తారు. పోడు భూముల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఎంతో మంది ఆదివాసీలను పోలీసులు జైల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ ఇప్పుడు దేశంలో ఏదో చేస్తానని చెబుతున్నాడని, ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. కేసీఆర్ జాతీయ పార్టీ ఒక అత్యాశ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..