Kishan Reddy.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Writes Letter To CM KCR Over Airports Permission: తెలంగాణలో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ అనుసంధానత కోసం అవసరమైన డెవలప్మెంట్ చేసివ్వాలని కేంద్రం ప్రభుత్వం కోరుతోందని, అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. సాంకేతిక, భూపరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకం తీసుకొచ్చిందని.. దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
INDWvsWIW: దీప్తి శర్మ తీన్మార్.. వెస్టిండీస్ 118/6
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
విమానాశ్రయాల నిర్మాణం అంశాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేఖలు రాసినా.. కేసీఆర్ నుంచి స్పందన రాలేదని కిషన్ రెడ్డి తెలిపారు. తాను కూడా గతేడాది జులై 30న కేసీఆర్కు లేఖ రాశానని, దానికి సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ, దేవకరద్ర, మమ్నూరు, బసంత్ నగర్, ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపిందని.. అయితే AAI చేపట్టిన OLS సర్వే, సాయిల్ టెస్టింగ్, టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా.. ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య.. ప్రస్తుతం 140 దాటిందని, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణలోనూ విమానాశ్రయాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని సూచించారు.
Rare ENT Surgery: పూర్తి వినికిడి లోపం చిన్నారులకు అరుదైన ఈఎన్టీ ఆపరేషన్
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!