INDWvsWIW: దీప్తి శర్మ తీన్మార్.. వెస్టిండీస్ 118/6
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటింగ్లో తడబడింది. ఓపెనర్ స్టెఫానీ టేలర్ (42)కు తోడు క్యాంప్బెల్ (30) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. దీంతో టీమిండియా ముందు 119 టార్గెట్ ఉంచింది విండీస్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో అదరగొట్టగా.. పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది
Also Read
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ మాథ్యూస్ (2)ను పూజా వస్త్రాకర్ బోల్తా కొట్టించింది. అనంతరం టేలర్, క్యాంప్బెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. వికెట్ కోసం కెప్టెన్ హర్మన్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఈ జోడీ తమ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ పూర్తి చేసుకుంది. అయితే కాసేపటికే వీరిద్దరినీ ఒకే ఓవర్లో ఔట్ చేసింది దీప్తి శర్మ. 14వ ఓవర్ మూడో బంతికి క్యాంప్బెల్, చివరి బంతికి టేలర్ను ఔట్ చేసి టీమిండియా క్యాంప్లో ఆనందం నింపింది. దీంతో రెండో వికెట్కు 73 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా చివర్లో హెన్రీ (2) విఫలమైనా నేషన్ (21 నాటౌట్), గజ్నబీ (15) కాసేపు పోరాడటంతో విండీస్ ఓ మోస్తారు స్కోర్ చేసింది.
Also Read: Oyo Bookings: ఓయోలో రికార్డు బుకింగ్స్.. వాలెంటైన్స్ డే పుణ్యమా అని!
తాజావార్తలు
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..