Kishan Reddy: సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. రైల్యేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు రైల్యే స్టేషన్ అభివృద్ది పనులను పర్యవేక్షించునున్నారు. కాగా..కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ను గతేడాది ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టగా, మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను సందర్శించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షిస్తారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.715 కోట్లు కేటాయించారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణతో పాటు స్టేషన్కు నలువైపులా రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
Read also: Astrology: ఫిబ్రవరి 07, బుధవారం దినఫలాలు
Also Read
కాంగ్రెస్ పార్టీ పాలన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆరు హామీలు ప్రజల చేతుల్లో గారడీగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులను ఎలా కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదని ఆరోపించారు. రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళా సమావేశంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!