Kishan Reddy: సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. రైల్యేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు రైల్యే స్టేషన్ అభివృద్ది పనులను పర్యవేక్షించునున్నారు. కాగా..కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ను గతేడాది ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టగా, మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను సందర్శించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షిస్తారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.715 కోట్లు కేటాయించారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణతో పాటు స్టేషన్కు నలువైపులా రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
Read also: Astrology: ఫిబ్రవరి 07, బుధవారం దినఫలాలు
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
కాంగ్రెస్ పార్టీ పాలన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆరు హామీలు ప్రజల చేతుల్లో గారడీగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులను ఎలా కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదని ఆరోపించారు. రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళా సమావేశంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!