Kishan Reddy: బీజేపీ అంటే ఓ నమ్మకం.. ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం.. అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం
- అదే ఊపుతో అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకం. నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు.దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నాం. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉంది. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. డిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉండడంతో సంబరాలు చేసుకోవడానికి పార్టీ ఆఫీసుకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కూర్చుని డిల్లీ ఎన్నికల ఫలితాలు Ntv స్క్రీన్ లో వీక్షిస్తున్నారు. డిల్లీ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎద్దేవ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది.. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుంది.. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయిందని సెటైర్స్ వేశారు.
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై NTV తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయం బీజేపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలన చూడబోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఈ విజయం బూస్టప్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మొదట సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తున్నాం అని పురందేశ్వరి తెలిపారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!