Kishan Reddy: బీజేపీ అంటే ఓ నమ్మకం.. ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం.. అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం
- అదే ఊపుతో అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకం. నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు.దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నాం. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉంది. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. డిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉండడంతో సంబరాలు చేసుకోవడానికి పార్టీ ఆఫీసుకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కూర్చుని డిల్లీ ఎన్నికల ఫలితాలు Ntv స్క్రీన్ లో వీక్షిస్తున్నారు. డిల్లీ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎద్దేవ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది.. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుంది.. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయిందని సెటైర్స్ వేశారు.
Also Read
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై NTV తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయం బీజేపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలన చూడబోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఈ విజయం బూస్టప్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మొదట సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తున్నాం అని పురందేశ్వరి తెలిపారు.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!