Kishan Reddy: బీజేపీ అంటే ఓ నమ్మకం.. ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం.. అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీలో విజయం సాధిస్తున్నాం
- అదే ఊపుతో అదే ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకం. నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు.దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నాం. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉంది. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. డిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉండడంతో సంబరాలు చేసుకోవడానికి పార్టీ ఆఫీసుకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కూర్చుని డిల్లీ ఎన్నికల ఫలితాలు Ntv స్క్రీన్ లో వీక్షిస్తున్నారు. డిల్లీ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎద్దేవ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది.. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుంది.. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయిందని సెటైర్స్ వేశారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై NTV తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయం బీజేపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలన చూడబోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఈ విజయం బూస్టప్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మొదట సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తున్నాం అని పురందేశ్వరి తెలిపారు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!