Kishan Reddy: విమోచన దినోత్సవాల్లో భాగంగానే బతుకమ్మ కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Interesting Comments On Bathukamma Celebrations: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘కర్తవ్య పథ్’లో కేంద్ర ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకల్ని నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం.. రాత్రి 8.30 వరకు కొనసాగింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తెలుగు మహిళలు మధ్యాహ్నం చేరుకొని.. బతుకమ్మలను అందంగా పూలతో పేర్చారు. సాయంత్రం ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని పేర్కొన్నారు. ఢిల్లీ గడ్డపై కర్తవ్య పథ్ వేదికగా ఈ సంబరాలు జరుపుకోవడంతో తెలంగాణకు మరింతగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో భాగంగా.. ఏడాదిపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఈ బతుకమ్మని ఢిల్లీలో నిర్వహించినట్టు తెలిపారు. నాడు రజాకార్లు మన ఆడబిడ్డలను అవమానిస్తూ నగ్నంగా బతుకమ్మను ఆడించిన రోజుల నుంచి.. నేడు స్వేచ్ఛగా, ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకునే అవకాశం దక్కడం వెనక ఎంతోమంది త్యాగాలతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకమైన చొరవ ఉన్నాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి సరైన గుర్తింపును కల్పించేందుకు ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ జీవన విధానమని.. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ జీవనం సాగించాలన్నదే బతుకమ్మ సందేశమని అన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
కాగా.. ఈ వేడుకల్లో కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, జల రవాణా మార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్, పీఎంవో, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సతీమణి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సతీమణితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!