తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ జెండా పాతుడే.. అసెంబ్లీపై విజయపతాకం అమిత్ షా ఎగురవేస్తరు. తెలంగాణాను కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చినమా.. ఇదేం నిజాం పరిపాలననా.. ఇక్కడికి ఎవరూ రాకూడదా.. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.
1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణకు రావాలంటే కేసీఆర్ కుటుంబ పరిష్మన్ తీసుకోవాలా.. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో.. ప్రతి తెలంగాణ బిడ్డకు అంతే హక్కు ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానన్నావు.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నావు.. 8 ఏళ్లలో అప్పుల తెలంగాణ చేసినవ్ అంటూ ఆయన కేసీఆర్పై అగ్రహం వ్యక్తం చేశారు.