Kishan Reddy: కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారు.. రైతులకు భద్రత బీజేపీతో సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ బహిరంగ నిర్వహిస్తుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్ల అనచివేతకు గురైన గడ్డపై రైతు సభా జరుపుతున్నామని.. అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు.
Biggboss 7: బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి రెండు హౌస్ లు.. ?
Also Read
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల వారిని మోసం చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుబంధు పేరుతో అనేక సమస్యలు ఉన్నాయని.. రైతు రుణమాఫీ పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రైతుల పంటలకు భీమ పథకం అమలు లేదని అన్నారు. కేసీఆర్ కోటి మాగాని ఏమైంది అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నష్ట పోతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకే గూటి పక్షులు అని.. ఎంఐఎం పార్టీకీ తొత్తులని విమర్శించారు. తెలంగాణ బాగుండాలంటే బీజేపికి ఓటు వేయండని కిషన్ రెడ్డి అన్నారు.
Mulugu Brs: ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు
అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతులకు భద్రత బీజేపీతో సాధ్యమన్నారు. కేసీఆర్ రింగ్ రోడ్డు భూములను అమ్ముకున్నాడని ఆరోపించారు. రైతు పంట కొంటానని చెప్పిన కేసీఆర్ దగా చేశాడని మండిపడ్డారు. సబ్సిడీలన్ని బీజేపీ అధికారం వచ్చాక అందజేస్తామని హామీ ఇచ్చారు. సామాన్యుడు సొంతింటి కళ నెరవెరలేదని.. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల తెలిపారు. మరోవైపు ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ మోసం చేయడంలో పీహెచ్ డి పొందాడాని దుయ్యబట్టారు. పాస్ పోర్ట్ దొంగ కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పేరు చెబితే బయట సిగ్గు పోతుందని.. పెగ్గు వేస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడని మండిపడ్డారు. తెలంగాణను అప్పుల స్టేట్ గా మార్చేశాడని.. తెలంగాణలో రామ రాజ్యం రావాలని బండి సంజయ్ అన్నారు.
- Tags
- amit sha
- bjp
- kcr
- Kishan Reddy
- Meeting
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!