TPCC Mahesh Kumar Goud: లోగో అంశంలో సంప్రదింపులు జరుగుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Kumar Goud: లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇవాళ ఆంధ్ర ప్రస్తావన చేస్తోందన్నారు. సమంత ఎవరు.. అంబాసిడర్ ఎలా అయ్యిందన్నారు. రకుల్ ప్రీత్ తెలంగాణ అమేనా..? కేటీఆర్ కి బాగా తెలుసు ఈమె గురించని కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు కట్టిన ప్రాజెక్టు కట్టింది ఎవరు ?.. యాదగిరిగుట్ట నిర్మాణం డిజైనర్ ఎవరు..ఆంధ్ర వ్యక్తి కాదా..?.. ఇన్ని మీరు చేసి మేము రాష్ట్ర గీతం కీరవాణి పాడితే తప్పా? అన్నారు.
Read also: Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
కీరవాణి కి అవార్డులు వచ్చినప్పుడు కేటీఆర్.. కేసీఆర్ అభినందించ లేదా..? లోగోలో అమరుల స్థూపం పెడితే బీఆర్ఎస్ కి ఎందుకు నొప్పి? అమరవీరుల స్థూపం ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి ప్రజలకు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లోగో అంశంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అమరుల ఆశయాల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నారు. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. కానీ అధికారం లో ఉన్న పదేళ్లు ఆయన గౌరవానికి మచ్చ పడిందన్నారు. ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ ని పిలుస్తున్నామన్నారు.
Read also: K. Laxman: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే నిందితులను శిక్షించండి.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ఆదివాసీ కాంగ్రెస్ అద్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు కేసీఆర్ హయాంలో ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్ర గీతం పదేళ్లు లేదు.. ఎందుకు లేదని కేసీఆర్ ని ఎప్పుడైనా ఆడిగారా? అని ప్రశ్నించారు. అందె శ్రీ తో ఫోన్ లో మాట్లాడి… సోషల్ మీడియాలో పెట్టడం సంస్కరమా? అన్నారు. కేటీఆర్ కి సిగ్గు ఉండాలి.. మాట్లాడటానికి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముసుగు వేసుకుని.. దోపిడీ చేసింది మీరు అని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసి… కట్టడి చేసిన మీరా ఆత్మగౌరవం గురించి మాట్లాడేదన్నారు. అమరవీరుల స్థూపం లోగోలో పెడితే కేటీఆర్ కి వచ్చిన నష్టం ఏందన్నారు. ఉద్యమంలో టీజీ అన్నావు.. టీఎస్ ఎందుకు పెట్టావు.. అప్పుడు కేసీఆర్ ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. టీఎస్ పెడుతున్నం అని కేసీఆర్ ఎవరిని అడిగి పెట్టారు? అని అడిగారు. కేటీఆర్ అహంకారం జుట్టు నుండి ఇంకా కిందికి రాలేదన్నారు.
CM Revanth Reddy: సెయింట్ మేరీస్ స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!