KCR: నేడు నిజామాబాద్ లో కేసీఆర్ రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, జహీ రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటన తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్ రోడ్షో మీదుగా కేసీఆర్ నిజామాబాద్ రానున్నారు. సాయంత్రం నిజామాబాద్లోని నెహ్రూ పార్కులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్లో బస చేస్తారు. ఇక రేపు (మంగళవారం) కామారెడ్డి జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. అదే రోజు సాయంత్రం కామారెడ్డి పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. కేసీఆర్ నగరంలో బస్సుయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా రోడ్షో జరిగే పలు కూడళ్లను పరిశీలించారు.
Read also: China: పెళ్లికి ముందు వైద్య పరీక్షలు.. పురుషుడిగా తేలిన మహిళ
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
* నగరంలో సోమవారం మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నగరంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ రోడ్ షో కారణంగా కింది ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు.
* బోదన్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అర్సపల్లి రైల్వేగేట్ మీదుగా కొత్త కలెక్టరేట్ మీదుగా కంఠేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బస్టాండ్ చేరుకోవాలి.
* బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులు రైల్వే ఫ్లై ఓవర్, శివాజీ చౌక్, నిజాం కాలనీ, అర్సపల్లి మీదుగా వెళ్లాలి.
* మాధవనగర్ నుంచి బోదన్ వెళ్లే వాహనాలు పులాంగ్ సర్కిల్, ఆర్ ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, ఈద్గా రోడ్డు అర్సపల్లి మీదుగా వెళ్లాలి.
పార్కింగ్ స్థలాలు
* ఆర్మూర్, డిచ్పల్లి నుంచి వచ్చే వాహనాలు ప్రెస్క్లబ్, పాత కలెక్టరేట్ గ్రౌండ్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఆగాలి.
* బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు శైలజా గ్రౌండ్, ఖిల్లా జూనియర్ కాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ చేయాలి. వాహనదారులు, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం, విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణుల సన్నాహాలు చేస్తున్నారు.
Israel Hamas Conflict: ఈ ప్రపంచంలో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!