KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
- తెలంగాణలో గతంలో భయంకర పరిస్థితులు ఉండేవి
- తెలంగాణ పదం అసెంబ్లీలో మాట్లాడవద్దని రూలింగ్ ఇచ్చారు..
- మిషన్ భగీరథ ఎందుకు కుంటుతుంది... లాగులు పగిలేలా కొట్టాలి
- కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
- పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన మరణం కోరుకుంటున్న వారికి తనదైన శైలిలో సమాధానమిస్తూనే, రాష్ట్రంలో ప్రస్తుత పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడటానికే వీల్లేకుండా రూలింగ్ ఇచ్చేవారు. బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు భరించలేక పార్టీ పెట్టి బయలుదేరాను. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సాధించాను” అని కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు కొందరు కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారని, కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగవని, తాను ఇప్పుడప్పుడే చావనని స్పష్టం చేశారు.
KCR: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా జీవన్రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
- Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సక్కగా ఉండేది. ఇప్పుడు కరెంటుకు ఏ రోగం వచ్చింది? ఏమైనా కాకి ఎత్తుకపోయిందా?” అని ప్రశ్నించారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న రాష్ట్రాన్ని ఈ ‘దరిద్రుల’ చేతిలో పెడితే.. నేడు ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను హెచ్చరించినట్లే జరుగుతోందని కేసీఆర్ అన్నారు. “వీళ్లు గెలిస్తే దళిత బంధుకి జైభీమ్, రైతుబంధుకి రాం రాం అని చెబుతారని ముందే చెప్పాను.
CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
ఇప్పుడు అదే జరుగుతోంది. రైతుబంధు డబ్బులు నెలల తరబడి వేస్తారా? రైతుల కష్టాలు వీళ్లకు పట్టడం లేదు” అని మండిపడ్డారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ పథకాన్ని ఎందుకు కుంటుపడేలా చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమైతే.. “లాగులు పగిలేలా కొట్టాలి” అంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం ఆగదని, కాంగ్రెస్ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!