TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- కేసీఆర్కు సీఎం రేవంత్ అండ
- భద్రతకు 52 మంది పోలీసులు
- కవిత వీడియోపై మహేష్ గౌడ్ కామెంట్స్
- పిండ ప్రదానాలపై తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలు , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సాగుతున్న ప్రచారాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి , కేసీఆర్ భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరంగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించడం కాంగ్రెస్ సాంప్రదాయమని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వడమే కాంగ్రెస్ సంస్కృతి
గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, జైపాల్ రెడ్డి వంటి ఎంతో మంది సీనియర్ ప్రతిపక్ష నాయకులు అనారోగ్యానికి గురైనప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా వారికి పూర్తి సహకారాన్ని అందించాయని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. విభేదాలు రాజకీయంగానే ఉంటాయి తప్ప, ఎవరి ఆరోగ్యం విషయంలోనూ కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేయదని అన్నారు. కేసీఆర్ అనారోగ్యానికి గురైన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, గ్రీన్ ఛానెల్ కేటాయించి అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ భద్రత కోసం ప్రభుత్వం 52 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని వివరించారు.
Also Read
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
సొంత కుటుంబంలోనే వివాదాలు… వీడియో క్లిప్ ప్రదర్శన
ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై పీసీసీ చీఫ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించాలని సొంత కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దీనికి బలం చేకూర్చేలా కేసీఆర్ కుమార్తె కవిత గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ను మీడియాకు ప్రదర్శించారు. హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తూ కవిత మాట్లాడిన వీడియోను చూపిస్తూ, బీఆర్ఎస్ కుటుంబంలో అంతర్గత పూజలు, వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు గమనించాలని సూచించారు.
పిండ ప్రదానం ఘటనలపై ఖండన
కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు పిండ ప్రదానం చేయడం వంటి చౌకబారు చర్యలను మహేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఆవేశంలో కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని, అంతేకానీ ఎవరికీ చెడు జరగాలని తాము ఎన్నడూ కోరుకోమని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల జరిగిన దళిత సంఘాల నిరసనలపై స్పందిస్తూ, అది వారి సొంత ఆవేదనతో చేసిన ఆందోళన మాత్రమేనని, ఆ నిరసనలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!