KCR Bus Yatra: నేడు ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ బస్సుయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Bus Yatra: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను అధిక శాతం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు… బస్సుయాత్రలు చేస్తూ జనంలోకి చేరారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని కేసీఆర్ అన్నారు.
Read also: The Raja Saab :రాజసాబ్ లో స్పెషల్ సాంగ్..ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ హంగామా..
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని… కేసీఆర్ పాలన బాగుందని… ప్రజలు కూడా గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. దీంతో కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించి బస్సుయాత్ర నిర్వహించారో… జనం భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.
Read also: Patanjali : బాబా రామ్దేవ్ తప్పుడు ప్రకటనల కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
బస్సు యాత్ర నేపథ్యంలో 12 లోక్ సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగుస్తుంది. ఈ పర్యటనలో కేసీఆర్ రోడ్ షోలకే పరిమితం కాకుండా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఉదయం రైతులు, మహిళలు, యువకులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలతో ప్రత్యేక సమావేశాలకు ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతామన్నారు.
Read also: Pakistan: భారత్ అగ్రరాజ్యంగా మారుతుంటే.. మేము అడుక్కుంటున్నాం..
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. 23 ఏళ్లలో ఉద్యమనేతగా, ముఖ్యమంత్రిగా వందలాది బహిరంగ సభలు, వేల సభలు, రోడ్ షోలతో రాష్ట్రంలో పర్యటించిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కరీంనగర్ మరియు చేవెళ్ల. నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో పొలంబాట పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు.
Glass Symbol Tension: ఇండిపెండెంట్లకు ‘గాజు గ్లాసు’ సింబల్.. కూటమి నేతలకు కునుకు కరువు..!
తాజావార్తలు
-
Cooler Tips: కూలర్ వల్ల మీ గది జిగటగా మారుతోందా..? ఈ చిన్న చిట్కాతో చెక్ పెట్టండి!
-
Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
-
Lenin : లెనిన్ గ్లిమ్స్.. స్లాంగ్ ఎక్కడో తేడా కొడుతుంది అయ్యగారు
-
RCB vs GT Qualifier 1: మళ్లీ అలానే ఆడతాం.. గుజరాత్కు ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ హెచ్చరిక!
-
Headache: తలనొప్పి వచ్చిందా..? ఈ ఒక్క ఆకు చాలు.. నిమిషాల్లో రిలీఫ్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!