కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందు శ్రీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినం.బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే బిసిలు బాగుపడుతారని అడిగాం. దేశంలో బిసిల జనాభ ఎంత ఉందో మొత్తం లెక్కించాలని కోరినం. కానీ ఏ ఒక్క పని కూడ కేంద్రం చేయలేదు. మొన్న ఓ వ్యక్తి కేరళ నుండి కేంద్ర మంత్రిని తీసుకు వచ్చి మాట్లాడించిండు. 28మంది బిసిలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని చెప్పారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి 10వేల కోట్ల బడ్జెట్ పెడితే బాగు పడుతారు కాని, 28మంది ఉంటే ఏమవుతుంది అని అడిగారు. ఇవేవీ పట్టించుకోని బిజేపి బిసిలను ఎట్లా ఓట్లు అడుగుతుంది అన్నారు.
Read Also : జ్యోతిరాదిత్య సింధియా ప్రగతి భవన్ కు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి..?
ఇక హుజురాబాద్ అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే గెళ్ళ శ్రీనివాస్ సాధ్యం. శ్రీను చేతిలో ఓడి పోతాననే భయం ఈటెల కు పట్టుకుంది. అందుకే నన్ను పోటీ చేయాలని ఈటెల అడుగుతుండు. ఎందుకంటే ఓ కార్యకర్త చేతిలో ఓడిపోతే బాగుండదని ఈటెల కు ఆర్ధం అయింది. ఇక నేను నిల్చుంటే ఈటల ఓడిపోతాడు అని పేర్కొన్నారు. ఓటు వేసేటప్పుడు మహిళలు సిలిండర్ కు దండం పెట్టుకోవాలి. అప్పుడే పక్క టీఆర్ఎస్ కు ఓటు పడుతుంది. తెలంగాణ లో ఇప్పటికే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వ బోతున్నాం అని తెలిపారు.