KTR: కరీంనగర్ సభకు నేను రాలేను.. కారణం చెప్పిన కేటీఆర్
KTR: నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. నేడు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నారు. అయితే.. ఈ సభకు కేటీఆర్ హాజరు కాలేరని తెలుస్తుంది. గత రెండు రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ తెలిపినట్లు గులాబీ వర్గాలు వెల్లడించారు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో కేటీఆర్ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందున కరీంనగర్ సభకు హాజరు కారని తెలుస్తుంది.
Read also: Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు
- Karimnagar: కరీంనగర్ RBL బ్యాంకులో 138 కోట్ల మోసం బట్టబయలు.. వెలుగులోకి కీలక విషయాలు..
- Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!
ఇవాళ సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ను సెంటిమెంట్గా భావిస్తారు. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు సమాచారం. కలిసొచ్చిన ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతుండగా, కళాశాల మైదానంలో సభా వేదికతోపాటు ప్రజల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసభకు కేటీఆర్ హాజరుకాలేరని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంతటి భారీ బహిరంగ సభకు కేటీఆర్ డుమ్మా కొట్టడం ఏంటని? ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ సభలో కేసీఆర్ ప్రసంగం పై బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ పెరగనుందా? అనే ఆశక్తి నెలకొంది.
Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. సినిమా కోసమేనా?
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!