Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు రావడంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ రాజీనామా చేశారు. ఇక, సాయంత్రం 4 గంటలకు ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ సమయం మారింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీతో జననాయక్ జనతా పార్టీతో పొత్తు లేకుండానే వారు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, మూడోసారి ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేజేపీతో పొత్తుకు ముగింపు పలికేందుకే సంకీర్ణ ప్రభుత్వం రాజీనామా చేసింది.
Read Also: MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
కాగా, చండీగఢ్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో, కేంద్ర పరిశీలకులు అర్జున్ ముండా- తరుణ్ చుగ్ సమక్షంలో మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తిరిగి ఎన్నుకోబడ్డారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేచి చూడాలి. కేంద్ర పరిశీలకులిద్దరూ హర్యానాలోని రాజ్ నివాస్కు చేరుకున్నారు. ఈ బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు అందరూ ఒక్క దగ్గరే ఉన్నారు.
Read Also: Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇక, దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనప్పటికీ పొత్తు కొనసాగించే సూచనలు రాలేదు. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని రెండు స్థానాలపై దుష్యంత్ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష నేతగా ఉన్నారు. హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో కమలం గుర్తు పైనే పోటీ చేస్తుందని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, రామ్ కుమార్ గౌతమ్తో సహా ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు చండీగఢ్లో బీజేపీతో టచ్లో ఉన్నారు అని మాజీ సీఎం ఖట్టర్ తెలిపారు. ఇక, మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని కొత్త బీజేపీ ప్రభుత్వానికి 41 మంది మద్దతు ఉంది.. మరో ఆరుగురు స్వతంత్రులు, ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..