Manohar Lal Khattar: మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు రావడంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ రాజీనామా చేశారు. ఇక, సాయంత్రం 4 గంటలకు ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ సమయం మారింది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీతో జననాయక్ జనతా పార్టీతో పొత్తు లేకుండానే వారు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, మూడోసారి ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జేజేపీతో పొత్తుకు ముగింపు పలికేందుకే సంకీర్ణ ప్రభుత్వం రాజీనామా చేసింది.
Read Also: MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
కాగా, చండీగఢ్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో, కేంద్ర పరిశీలకులు అర్జున్ ముండా- తరుణ్ చుగ్ సమక్షంలో మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తిరిగి ఎన్నుకోబడ్డారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేచి చూడాలి. కేంద్ర పరిశీలకులిద్దరూ హర్యానాలోని రాజ్ నివాస్కు చేరుకున్నారు. ఈ బీజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు అందరూ ఒక్క దగ్గరే ఉన్నారు.
Read Also: Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇక, దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనప్పటికీ పొత్తు కొనసాగించే సూచనలు రాలేదు. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని రెండు స్థానాలపై దుష్యంత్ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్ష నేతగా ఉన్నారు. హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో కమలం గుర్తు పైనే పోటీ చేస్తుందని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, రామ్ కుమార్ గౌతమ్తో సహా ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు చండీగఢ్లో బీజేపీతో టచ్లో ఉన్నారు అని మాజీ సీఎం ఖట్టర్ తెలిపారు. ఇక, మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని కొత్త బీజేపీ ప్రభుత్వానికి 41 మంది మద్దతు ఉంది.. మరో ఆరుగురు స్వతంత్రులు, ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!