Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?
- బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడి కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం
- కాంగ్రెస్పై రాజకీయ కుట్ర ఆరోపణ
- బీసీ రిజర్వేషన్లో ముస్లింలకు 10 శాతం కేటాయింపును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: PM Modi: ఆగస్టు 23 వరకు మీ సలహాలు, సూచనలు పంపండి..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
బండి సంజయ్ మాట్లాడుతూ, “బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ గుడిని కూల్చడం హిందువుల మనోభావాలను గాయపరిచే చర్య. రాష్ట్రంలో రోడ్డుకు అడ్డంగా ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నాయి? ఒక్క గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు?” అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 80 శాతం హిందువులు ఏకమై ఈ చర్యకు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. “ఈ కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గం ఓట్లను ఆకర్షించే కుట్ర ఉంది,” అని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ చెబుతున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ అనేది కేవలం ముస్లిం రిజర్వేషన్గా మారింది. బీసీలకు కేవలం 5 శాతం అదనపు రిజర్వేషన్ (27 శాతం నుంచి 32 శాతం) మాత్రమే వస్తుంది, మిగిలిన 10 శాతం ముస్లింలకు కేటాయిస్తున్నారు. ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లిం రిజర్వేషన్,” అని ఆయన విమర్శించారు. ఈ విధానాన్ని తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “స్థానిక ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్కు బుద్ధి చెబుతారు,” అని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
-
Sunrisers: ‘దక్షిణాఫ్రికా క్రికెట్ను బతికించింది కాటేరమ్మ కొడుకులే’.. డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Renault Duster: లీటర్కు 19 కి.మీ మైలేజ్.. రెనాల్ట్ డస్టర్ కొత్త వేరియంట్పై కీలక అప్డేట్
-
Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె ‘మేకప్ మంత్రి’..!
-
Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!