Bandi Sanjay: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుంది..
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
- బీఆర్ఎస్- బీజేపీలో విలీనం అనే అంశంపై బండి సంజయ్ స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అనే అంశంపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ గంగలో కలిసిన పార్టీ , ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్న ఏమి ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి , కుటుంబ పార్టీలకు తాము దూరంగా ఉంటామన్నారు. కేటీఆర్ , కేసీఆర్ లను ప్రజలు చీదరించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారన్నారు.
Read also: Nirmal: గుండెలు పిండే విషాదం.. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన..
Also Read
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
వారి విలీనం పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకే , బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని ప్రచారం చేస్తున్నారన్నారు. మొదట కాంగ్రెస్ నాయకుడైన కేసీఆర్ ఆ పార్టీలోకే పోతారన్నారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదు… ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు. ఆరు గ్యారెంటీ లను పక్కదోవ పట్టించడానికే ఈ ప్రచారానికి తెరలేపారన్నారు. రుణ మాఫీ పై రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. బ్యాంక్ ల నుండి ఎన్వోసి లు ఇప్పించాలన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదన్నారు. రైతుల పక్షాన బీజేపీ కొట్లాడుతుందన్నారు.
Read also: Nirmal: గుండెలు పిండే విషాదం.. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన..
అనంతరం హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మేన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంస్థ… అనేక మంది మహనీయుల మార్గదర్శకంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు. శ్యామ్ జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని… కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉందని వెల్లడించారు.
Read also: Rains Updates: ఈరోజు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
క్లినిక్, లైబ్రరీ, సమావేశం మందిరం, శిక్షణ సేవకార్యక్రమలు కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. గొప్ప వ్యక్తుల చరిత్రను గెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు భారత దేశంపై కుట్రలు చేస్తున్నాయని… దీన్ని ప్రధాని మోదీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. బంగ్లాదేశ్ లో భారతీయులపై దాడులపై మాట్లాడుతున్న వారు… మొదట భవిష్యత్ లో భారత్ లో ఇలాంటి ఘటనలు ఏర్పడితే ఎలా ఎదుర్కోవలో ఆలోచించాలని కోరారు. హిందు ధర్మం పరిరక్షణ కోసం ముందుకు రావాలని… గోహత్యాలు, లవ్ జిహాదీ నియంత్రించడం కోసం ఇలాంటి కేంద్రాలలో సమావేశలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు.
CLP Meeting: నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్..
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!