Diwali in Graveyard: వామ్మో ఇదేం ఊరురా నాయనా.. శ్మశానంలో దీపావళా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali in Graveyard: దీపావళి అంటే ఇంట్లో పండుగ వాతావరణమే.. పూల అలంకారం.. ముగ్గులతో ముంగిల్లు.. కాంతులతో విరజిల్లుతుంది. టపాసులతో ఇంటి ప్రాంగణం అంతా మారుమోగ్రాల్సిందే. కానీ ఓ ఊరిలో సమాధుల వద్ద దీపావళి జరుపుకోవడం ఎప్పుడైనా చూశారా?.. పగలు శ్మశానం చూస్తేనే ఒల్లు ఝల్లు మంటుంది. ఇక రాత్రి శ్మశానం దారి నుంచి వెళ్లాలంటే ఇంక అంతే సంగతి. ఆ దారి తాటేంత వరకు ప్రాణాలు గాల్లోకే.. అలాంటిది శ్మశానంలో దీపావళి జరుపుకుంటే.. అది చూడాలంటే కరీంనగర్ లోని కార్ఖానగడ్డ కాలనీకి మీరు వెళ్లాల్సిందే. దీపావళి వచ్చే కొద్దిరోజుల ముందే అక్కడ సమాధులు రంగులద్దుకుంటాయి. శ్మశానంలోని సమాధులు రంగురంగు లైట్లతో తళుక్కుమంటుంది. సమాధుల వద్ద వున్న పిచ్చిమొక్కలు మాయమవుతాయి. దీపాల వెలుగుల్లో జాతర మొదలవుతుంది. అయితే .. దశాబ్దాలుగా కార్ఖానగడ్డ వాసులు దీపావళి వేడుకలు ఇలాగే చేసుకుంటున్నారు. తమ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డ తమ పూర్వీకులను స్మరించుకోవాలన్న ఉద్దేశంతోనే బంధువులతో పాటు శ్మశానానికి వెళ్లి తమవారి సమాధుల వద్ద దీపావళి చేసుకుంటామని వాళ్లు చెబుతారు.
Read also: Fire Accident : బెజవాడను బెంబేలెత్తిస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
చనిపోయినవారు ఎప్పటికీ ఒంటరివారు కాదుని.. భౌతికంగా వాళ్లు దూరమైనా ఎప్పటికీ కుటుంబ సభ్యులతో ఉన్నారనే నమ్మకంతో ఇలా స్మశానంలో పండుగ చేస్తామంటున్నారు ఆఊరి ప్రజలు. శ్మశానానికి రంగులు పూసి, పూలతో ముస్తాబు చేసి ముగ్గులు వేసి చక్కగా అలంకరిస్తారు. దీపాలు పెట్టి దీపాలు పెట్టి దీపాల వెలుగులో పండుగ వాతావరణాన్ని ఆశ్వాదిస్తారు. అంతేకాదు.. మరణించిన తమ పూర్వీకులు బతికి ఉన్నప్పుడు ఏయే పదార్థాలు ఇష్టపడి తినేవారో వాటిని వండి తీసుకుని వచ్చి సమాధుల ముందు నైవేద్యంగా పెడతారు. మళ్లీ వాటిని తీసుకుని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆతరువాత సమాధుల మధ్య టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటారు. శ్మశానవాటికలో దాదాపు లక్షమందికి పైగా రావడంతో శ్మశానం సందడి వాతావరణం కనిపిస్తుంది. దీపావళి రోజు శ్మశానంలో జాతరను తలపిస్తుంది. దెయ్యాలు, భూతాలంటూ అభిప్రాయపడే వారికి ఇలాంటివి మంచి సమాధానాలు. వారుకూడా ఒకప్పుడు మనుషులే అని ఈదీపాళి ప్రతి ఒక్కరికి గుర్తు చేసుకుంటూ ఇలా జరుపుకునే పండుగను కరీంనగర్ లోని కార్ఖానగడ్డ వాసులకే చెల్లుతుంది. శ్మశానంలో పండుగ ఏంటని అందరూ ఆశ్చర్యపోయినా నిజం మాత్రం ఇదే.
No Diwali: దీపావళి అంటేనే భయం.. వేడుకలపై బ్యాన్.. ఎక్కడ..? ఎందుకంటే..?
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి