Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nanda deepam: పురాణాల ప్రకారం ఏదైనా దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాలు ఉంచితే ఆ ప్రాంతం, గుడి, గ్రామస్తులు సుఖ సంతోషాలతో, శాంతి, సౌభాగ్యాలతో జీవిస్తారని చెబుతారు. ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతుంటారు. అందుకే ఆలయాల్లో దీపారాధన తప్పనిసరిగా చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వెలసిన శ్రీసీతారామస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇల్లు, గుడి, పాఠశాల ఎక్కడ నిర్మించినా దీపం వెలిగిస్తారు. అయితే ఈ ఆలయంలోని నంద దీపం ఎప్పుడూ గొప్ప దీపంలా వెలుగుతూ ఉంటుంది. ఈ నందా దీపం ఒకట్రెండు సంవత్సరాలే కాదు సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని 1314లో కాకతీయుల చివరి రాజు ప్రతాప రుద్రుడు ఆలయ గంటపై చెక్కిన అంకెల ఆధారంగా తెలుస్తుంది. అంతటి పురాతన ఆలయంలోని నంద దీపం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన నందదీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూ ఉండడం విశేషం. దాని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం.
Read also: Chess Player Cheating: బుర్కా ధరించి మహిళల టోర్నమెంట్లో పాల్గొన్నాడు.. కానీ చివరికి..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఆలయ నిర్మాణ సమయంలో ఆనాటి రాజులు నిత్యం దీపం వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులో కొంత భాగం దీపానికి నూనెను కొనుగోలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. రాజుల కాలం ముగిసిన తర్వాత గ్రామంలోని దాతలు దీపానికి నూనెను అందించేవారు. గంభీరావుపేటకు చెందిన ఐత రాములు, ప్రమీల దంపతులు జీవితకాలం సరఫరా చేస్తామన్న హామీ మేరకు ప్రస్తుతం నూనె సరఫరా చేస్తున్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఏటా కల్యాణం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయంతో పాటు నంద దీపాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆలయం ముందు కల్యాణ మండపం 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో అందంగా నిర్మించబడింది. ఇది ఆలయ ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామస్వామి కల్యాణం జరుగుతుంది. కల్యాణ మహోత్సవంతో పాటు నందదీపాను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు.
Sai Dharam Tej: ‘విరూపాక్ష’ పెద్దలకు మాత్రమేనా!?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!