Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nanda deepam: పురాణాల ప్రకారం ఏదైనా దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాలు ఉంచితే ఆ ప్రాంతం, గుడి, గ్రామస్తులు సుఖ సంతోషాలతో, శాంతి, సౌభాగ్యాలతో జీవిస్తారని చెబుతారు. ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతుంటారు. అందుకే ఆలయాల్లో దీపారాధన తప్పనిసరిగా చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వెలసిన శ్రీసీతారామస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇల్లు, గుడి, పాఠశాల ఎక్కడ నిర్మించినా దీపం వెలిగిస్తారు. అయితే ఈ ఆలయంలోని నంద దీపం ఎప్పుడూ గొప్ప దీపంలా వెలుగుతూ ఉంటుంది. ఈ నందా దీపం ఒకట్రెండు సంవత్సరాలే కాదు సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని 1314లో కాకతీయుల చివరి రాజు ప్రతాప రుద్రుడు ఆలయ గంటపై చెక్కిన అంకెల ఆధారంగా తెలుస్తుంది. అంతటి పురాతన ఆలయంలోని నంద దీపం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన నందదీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూ ఉండడం విశేషం. దాని ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం.
Read also: Chess Player Cheating: బుర్కా ధరించి మహిళల టోర్నమెంట్లో పాల్గొన్నాడు.. కానీ చివరికి..!
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ఆలయ నిర్మాణ సమయంలో ఆనాటి రాజులు నిత్యం దీపం వెలిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులో కొంత భాగం దీపానికి నూనెను కొనుగోలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. రాజుల కాలం ముగిసిన తర్వాత గ్రామంలోని దాతలు దీపానికి నూనెను అందించేవారు. గంభీరావుపేటకు చెందిన ఐత రాములు, ప్రమీల దంపతులు జీవితకాలం సరఫరా చేస్తామన్న హామీ మేరకు ప్రస్తుతం నూనె సరఫరా చేస్తున్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఏటా కల్యాణం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయంతో పాటు నంద దీపాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆలయం ముందు కల్యాణ మండపం 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో అందంగా నిర్మించబడింది. ఇది ఆలయ ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామస్వామి కల్యాణం జరుగుతుంది. కల్యాణ మహోత్సవంతో పాటు నందదీపాను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు.
Sai Dharam Tej: ‘విరూపాక్ష’ పెద్దలకు మాత్రమేనా!?
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!